సర్వేకు రేటు కట్టిన సర్వేయర్‌కు ఏసీబీ షాక్‌

సైదాపూర్‌/ధనాధన్ న్యూస్ జూన్‌ 5:మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. భూమి సర్వే నిర్వహించేందుకు రైతు నుంచి లంచం డిమాండ్‌ చేసిన మండల సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్వేయర్‌తో పాటు ఇద్దరు సహాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌ గ్రామానికి చెందిన రైతు చుంచు మహేందర్‌కు సైదాపూర్‌ మండలం అమ్మనగుర్తి గ్రామ శివారులో మూడు ఎకరాల భూమి … Read more

ఎండదెబ్బతో గొర్రెల కాపరి మృతి

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 5: మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎండదెబ్బ తగిలి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిల్లి శ్రీశైలం (29) గురువారం ఉదయం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఎండ ప్రభావంతో తల తిరగడం, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తన తండ్రి పిల్లి తిరుపతికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో తిరుపతి గ్రామానికి చెందిన … Read more

కరీంనగర్‌లో పిడుగుపాటు..యువకుడికి తృటిలో తప్పిన ప్రమాదం.

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లాలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లో ఒక స్థానికుడు తన మొబైల్‌తో వర్షాన్ని రికార్డ్ చేస్తుండగా, సమీపంలో అకస్మాత్తుగా పిడుగు పడింది.ఈ సంఘటనతో అతడు తీవ్ర భయాందోళనకు గురై ఉలిక్కిపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

దళితబంధు సాధన సమితి సభ్యులకు న్యాయం చేయాలి: కొలుగూరి నరేష్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 4: దళితబంధు రెండో విడతను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట పట్టణంలో దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.అనంతరం సమితి నాయకులు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యపై వెంటనే స్పందించిన చైర్మన్, సంబంధిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో ఫోన్‌లో మాట్లాడి, ఒక వారంలో సమస్య పరిష్కారానికి … Read more

మరమ్మతులకు నోచుకోని తుమ్మలచెరువు కట్టు కాలువ

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 4: సైదాపూర్ మండలంలోని తుమ్మలచెరువు కట్టు కాలువ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రెండు చోట్ల దెబ్బతిన్నప్పటికీ ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదని వెంకేపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు మునుపాల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న వర్షాకాలానికి ముందే చెరువు కట్టు కాలువకు మరమ్మతులు చేపట్టకపోతే భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. మరోసారి భారీ వర్షాలు కురిస్తే తుమ్మలచెరువు కట్ట పూర్తిగా … Read more

జమ్మికుంటలో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 3: తెలంగాణ ఉద్యమ యోధుడు, రైతు బాంధవుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో టి హెచ్ ఆర్ టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సమీపంలోని శివాలయం (బొమ్మల గుడి)లో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. టి హెచ్ ఆర్ టీం రాష్ట్ర కమిటీ మరియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ వర్మ అప్పని … Read more

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైదాపూర్ మండలంలోని గ్రామాల్లో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడుతూ..దశాబ్దాల కల నెరవేరిన రోజు తెలంగాణ ఆవిర్భావ దినమని పేర్కొన్నారు. ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. “మన రాష్ట్రం – మన పాలన” అనే లక్ష్యంతో … Read more

16నెలలుగా ఫైల్ పెండింగ్..!డిపివోపై ఫిర్యాదు

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 2:జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి (డిపివో) చీకోటి మదన్ మోహన్ గత 16 నెలలుగా నివేదిక సమర్పించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కోరుట్లకు చెందిన చుక్క గంగారాజం సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ 2025 సెప్టెంబర్ నెలలో జారీ చేసిన ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారి బేఖాతర్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన చుక్క గంగారాజం, కోరుట్ల … Read more

పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వెళ్లిన మాజీ సర్పంచుల అరెస్ట్

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 1: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సైదాపూర్ మండల మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రేగుల సుమలత అశోక్ మాట్లాడుతూ, తమ పదవీకాలంలో గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు … Read more

క్రికెట్ ఫీవర్..పోలీసుల స్పెషల్ నిఘా..!

హుజూరాబాద్‌/ధనాధన్ న్యూస్,మే 31 :ఈ రోజు జరగనున్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హుజూరాబాద్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏసీపీ వాసంశెట్టి మాధవి తెలిపారు. మ్యాచ్ నేపథ్యంలో ఎలాంటి బెట్టింగ్ కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు, గొడవలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏసీపీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, ప్రజా రద్దీ ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. … Read more