లేఅవుట్‌లో లేని సర్వే నంబర్.. కొనుగోలుదారుడి చిక్కులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 9:ప్లాట్ కొనుగోలు విషయంలో సర్వే నంబర్ నమోదు లోపంతో రుణం తిరస్కరణకు గురైన బాధితుడి ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డే దుర్గాప్రసాద్ (46), ప్రస్తుతం జమ్మికుంటలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో ఉన్న అంజనా టౌన్‌షిప్‌లో 59వ నంబర్ ప్లాట్‌ను కొనుగోలు చేశారు.ఈ ప్లాట్‌ను జొన్నతుల కోనారెడ్డి, రాఘవరెడ్డి, గర్రెపల్లి … Read more

మల్లాపూర్‌లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 9: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం మల్లాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు రూ.89,10,324 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈ … Read more

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

బుగ్గారం/ధనాధన్ న్యూస్ జూన్ 9:జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు, దళిత రైతు మానాల పెద్ద దుబ్బయ్య (60) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కౌలుకు తీసుకున్న పొలాల సమీపంలోనే ఆయన మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు, బుగ్గారం ఎస్సై జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, పెద్ద దుబ్బయ్య పలువురు రైతుల భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే ఇటీవల … Read more

మృగశిర కార్తిలో చేపల కోసం నిరీక్షణ.. నిరాశతో వెనుదిరిగిన ప్రజలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 8: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో మృగశిర కార్తి సందర్భంగా సోమవారం గ్రామ చెరువులో చేపల వేట నిర్వహించారు. చేపలు లభిస్తాయనే ఆశతో ఆకునూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు చెరువు వద్దకు తరలివచ్చారు. అయితే ఆశించిన మేర చేపలు దొరకకపోవడంతో దాదాపు 500 మందికి పైగా ప్రజలు నిరాశతో, ఆగ్రహంతో వెనుదిరిగారు.ప్రజలు మాట్లాడుతూ ఉదయం నుంచే చెరువు వద్ద వేచి ఉన్నప్పటికీ సాయంత్రం నాలుగు గంటల … Read more

గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం – కరీంనగర్‌లో వంటా-వార్పు

కరీంనగర్/ధనాధన్ న్యూస్ జూన్ 8: కేంద్రంలోని ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఎల్‌పీజీ గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలోని ఇందిరా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బీజేపీ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి … Read more

నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకెట్ హాల్ నిర్మాణం

మెట్‌పల్లి/ధనాధన్ న్యూస్,జూన్ 8: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని 63వ జాతీయ రహదారిని ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకెట్ హాల్ నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వంకాయల ముఖేష్ చంద్ర జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, జాతీయ రహదారి పక్కనే ఎలాంటి షెడ్‌బ్యాక్ లేకుండా బ్యాంకెట్ హాల్ నిర్మాణ పనులు చేపడుతున్నారని తెలిపారు. నిర్మాణ స్థలం పక్కగా, … Read more

మృగశిర కార్తె సందర్భంగా ఉచిత ఆయుర్వేద మందు పంపిణీ

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో ఉన్న శ్రీ సూర్య భగవాన్ ధన్వంతరి ఆలయంలో మృగశిర కార్తె సందర్భంగా భక్తులకు మృగశిర ఆయుర్వేద ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మృగశిర కార్తె రోజున ఈ ఔషధాన్ని సేవించడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఈసినోఫిలియా తదితర అలర్జీ సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. … Read more

అంతర్గాంలో మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవ ప్రారంభం

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో సర్పంచ్ కంటెస్టెడ్ అభ్యర్థి కోల భవాని-అరుణ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళల కోసం ఉచిత ఆటో ప్రయాణ సేవను సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవను ప్రారంభించి మాట్లాడారు. మహిళల సంక్షేమం, సౌకర్యాల కల్పనకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మహిళల … Read more

తెలంగాణ ఉద్యమకారుడు పులిగారి చంద్రశేఖర్ రెడ్డికి ఘన నివాళి

వికారాబాద్/ధనాధన్ న్యూస్ జూన్ 8: తెలంగాణ ఉద్యమకారుడు, వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ దివంగత పులిగారి చంద్రశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా సోమవారం వికాస్ జూనియర్ కళాశాల ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి తెలంగాణ ఉద్యమకారులు, కళాశాల సిబ్బంది, మున్నూరు సోమారం గ్రామ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పులిగారి చంద్రశేఖర్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజ సేవతో పాటు విద్యా రంగ … Read more

జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టుల ప్రతినిధులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజానికి సమాచారాన్ని అందిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయితే తక్కువ ఆదాయంతో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు తమ పిల్లల విద్యా ఖర్చులను భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. … Read more