ఎస్బీఐ లైఫ్ కార్యాలయంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ఫాదర్స్ డే సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ఎస్బీఐ లైఫ్ కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పాలసీలు కలిగిన ఐదుగురు తండ్రులను లైఫ్ మిత్ర తవటం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో, కుటుంబ వ్యవస్థలో తండ్రులకు ప్రత్యేక స్థానం ఉండటంతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంలో వారి పాత్ర కీలకమని ఎస్బీఐ … Read more

వర్షాలు కురవాలంటూ గ్రామదేవతలకు జలాభిషేకాలు

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ, వర్షాలు కురవాల్సిన సమయంలోనూ వర్షాల జాడ కనిపించకపోవడంతో హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.గ్రామంలో ఉన్న గ్రామదేవతలు, వనదేవతలు, హనుమంతుడు, భైరవాది గుట్టలోని కాలభైరవ స్వామికి జలాభిషేకాలు చేసి వర్షాలు కురవాలని వేడుకున్నారు. సంప్రదాయ ఆచారాల ప్రకారం బండపై వరద పాశం పోసి నాలుకతో అద్దడం, బతకమ్మ ఆటలు ఆడడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుపక్షాదులు, ప్రజలు చల్లగా … Read more

మానవత్వం చాటుకున్న రాయికల్ 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 21: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ విద్యార్థులు తమ సహాధ్యాయి మాచర్ల నాగరాజుకు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.రాయికల్ గ్రామానికి చెందిన మాచర్ల నాగరాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో ఆయన తండ్రి మాచర్ల కొమురయ్య గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులు … Read more

మత సామరస్యానికి ప్రతీకగా మొహరం ఉత్సవాలు

నంగునూరు/ధనాధన్ న్యూస్,జూన్ 20:సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మతాలకు అతీతంగా, చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, గట్ల మల్యాల గ్రామంలో ప్రతి సంవత్సరం మొహరం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. హిందూ, ముస్లిం సోదరులు కలిసి సామరస్య వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవడం గ్రామ ప్రత్యేకత అని తెలిపారు.మత సామరస్యానికి ప్రతీకగా … Read more

పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 20: సారంగాపూర్ మండలం పోతారం గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్క దాడిలో గాయపడిన బాధితులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. పిచ్చికుక్క దాడిలో మహిళలు సహా 11 మందికి పైగా గాయపడగా, వారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యే బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడిన … Read more

గ్రామ దేవతల ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఊర్లను కాపాడే అమ్మవార్లు ప్రజలకు ఇష్టమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన శ్రీ మహాలక్ష్మి,భూ లక్ష్మీ,నాభి శిల (బొడ్రాయి),పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగ్గయ్యపల్లి గ్రామంలో … Read more

అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:అటవీశాఖ అధికారులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 18 (ప్రతినిధి):వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలోని అటవీ భూమిలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఉన్నతాధికారులు అడవుల ఆవశ్యకత, మొక్కల పెంపకం ప్రాధాన్యత, వాటి సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు, సలహాలు అందించారు. అలాగే రాయికల్ అటవీ ప్రాంతంలో ఉన్న రాయికల్ జలపాతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయికల్ … Read more

విద్యను వ్యాపారంగా మారుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 18: కరీంనగర్ నగరంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలల యజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో పుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని శ్రీ చైతన్య పాఠశాలలో విజ్ఞాన కేంద్రాలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారాయని శ్రీ చైతన్య పాఠశాలలు నిబంధనలు పాటించకపోతే ఆ పాఠశాలలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భౌతిక దాడులు చేస్తామని ఒక్క రూపాయి ఎక్కువ ఫీజులు వసూలు చేసిన ఊరుకునేది లేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ హెచ్చరించారు. గురువారం  … Read more

అద్దాల మేడలు, ప్లాస్టిక్ బొమ్మలు చూసి మోసపోకండి…!

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, జూన్ 18: అద్దాలమేడలు, ప్లాస్టిక్ బొమ్మలు మీ పిల్లల భవిష్యత్తును మార్చలేవు, పిల్లలకు కావాల్సింది చదువు పొందాల్సిందే విజ్ఞానం “తోటోడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా ” అనే చందంగా ఉన్నది మన తల్లిదండ్రుల పరిస్థితి చిన్నపిల్లల చదువు కోసం లక్షల రూపాయలు వెచ్చించి అనవసరంగా ఆర్థిక నష్టాలు పొంది అప్పుల పాలవుతున్న పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే నేను పెద్ద స్కూల్లో … Read more

ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17:ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల స్వంతింటి కల నెరవేర్చుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.కొండాపూర్ గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో  9 ఇళ్ల పూర్తి కాగా బుధవారం గృహ ప్రవేశాలు నిర్వహించారు. గృహప్రవేశ వేడుకలకు హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో … Read more