పెద్ద వాగులో ప్రమాదకరంగా పెరిగిన వరద ప్రవాహం

మహా ముత్తారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం నిమ్మగూడెం–పెగడపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా నిమ్మగూడెం గ్రామపంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు.వాగు దాటే మార్గంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ఎవరూ వాగును దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు […]

జమ్మికుంటలో రికార్డింగ్ స్టూడియో ప్రారంభం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మండల కేంద్రంలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ పుల్లా శ్రీలత మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ, పరిసరాల ప్రాంత ప్రజల సౌకర్యార్థం అట్టహాసంగా, అత్యంత నూతన పరికరాలతో నేడు జమ్మికుంట బస్టాండ్ ఆవరణలో శ్రావణ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఇకపై రికార్డింగ్ కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని, అత్యంత మెరుగైన పరికరాలతో రికార్డింగ్ స్టూడియో ను అందుబాటులోకి తీసుకోవచ్చామని […]

స్కూల్ ను కాపాడడం కోసం కదం తొక్కిన మహిళలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో గురువారం రోజున ఉదయం గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకి తీసుకుని వెళ్లడానికి వచ్చిన స్కూల్ బస్సులను, మోడల్ స్కూల్ బస్సును, మహిళలందరూ అడ్డుకొని, బస్సు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి మహిళలు ధర్నా చేసి,గ్రామంలోని విద్యార్థులను బస్సులో నుంచి దింపి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వెళ్లడానికి గల కారణాలు అడిగి తెలుసుకోని,విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేటువంటి బాధ్యత మాదేనని […]