హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మారనివ్వం: డంపింగ్ యార్డ్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

హైదరాబాద్/ధనాధన్ న్యూస్,ఏప్రిల్ 17: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.హుజురాబాద్ ప్రాంతంలో నాలుగు జిల్లాల చెత్తను తరలించి డంపింగ్ యార్డ్ నిర్మించాలన్న ప్రణాళిక ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురై ప్రజల జీవన ప్రమాణాలు … Read more

“సామాన్యుల కాలనీల దుస్థితి: రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజల ఆవేదన”

ఒంగోలు/ధనాధన్ న్యూస్,ఏప్రిల్ 12:సామాన్య ప్రజలు నివసించే కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కాలనీల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండగా, సాధారణ ప్రజల కాలనీల్లో మాత్రం రోడ్లు, డ్రైనేజీలు లేక దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని విమర్శిస్తున్నారు.ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని జయప్రకాష్ కాలనీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీలు లేకపోవడం, సీసీ రోడ్లు దెబ్బతినడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు … Read more

కమీషన్ల కోసమే బల్దియా టెండర్ల రద్దా..? కరీంనగర్‌లో రాజకీయ వేడి

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ నగర పాలక సంస్థలో టెండర్ల రద్దు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. విలీన గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టాల్సిన పనులు నిలిచిపోవడంతో వివాదం చెలరేగింది.ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం విలీన గ్రామాల అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులను మంజూరు చేసి, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల కోసం టెండర్లు పిలిచింది. దాదాపు 87 అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లు ఆన్లైన్‌లో … Read more

మత మార్పిడి తర్వాత ‘ఎస్సీ’ స్టేటస్ చెల్లుతుందా? ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!

న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఒక కీలక కేసులో సంచలన తీర్పు వెలువరించింది. మత మార్పిడి చేసుకున్న వ్యక్తులకు షెడ్యూల్డ్ కులాల (SC) రిజర్వేషన్లు మరియు చట్టపరమైన రక్షణలు వర్తిస్తాయా లేదా అనే అంశంపై కోర్టు పూర్తి స్పష్టతనిచ్చింది. అసలేం జరిగింది?గుంటూరు జిల్లాకు చెందిన పాస్టర్ ఆనంద్ అనే వ్యక్తి, తనను కొందరు కులం పేరుతో దూషించారని మరియు దాడి చేశారని 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ఆరుగురిపై SC/ST అట్రాసిటీ … Read more

రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ విజయవంతం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండల పరిధిలోని స్థానిక బస్టాండ్ ఏరియా,కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా వద్ద శనివారం రోజున,రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బందుకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలు నేడు  రాష్ట్రవ్యాప్తంగా ఆటోలను బందు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని,ఈ పథకం వలన ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి … Read more

భార్యను చూడటానికి బస్సును ఎత్తుకెళ్ళిన భర్త

నందికొట్కూరు/ధనాధన్ న్యూస్: భార్యను చూడటానికి ఏకంగా ఏపిఎస్ ఆర్టీసి బస్సునే ఎత్తుకెళ్లాడు ఓ భర్త.బస్ దొంగతనం విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆపి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంటుందని,నా భార్యను చూసేందుకు వాహనాలేవి లేకపోవడంతో చూస్తున్న క్రమంలో బస్టాండ్ లో బస్సు ఉందని,తాళాలు బస్సుకే ఉండటంతో బస్సును తెచ్చుకున్నానని పోలీసులకు సమాధానం ఇచ్చాడు.ఈ సంఘటన పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది..

బిజిగిరి దర్గాలో ప్రత్యేక పూజలు.

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు,పేద ప్రజలకు అన్నదానం,కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలోని దర్గాలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ మైనార్టీ ఇన్చార్జ్ ఎండి సలీం పాషా,మాజీ జెడ్పీటిసీ అరుకాల వీరేశలింగం,జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు … Read more

కేసీఆర్ కుట్రలను సాగనివ్వం

తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి ఎన్నికను అడ్డుకుంటున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెబుతారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అన్నారు. కోదండరాంపై కేసీఆర్ కుట్రలు కొత్తేమి కాదని గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక రకాల దాడులకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో కోదండరాం పోటీ చేస్తే వందలాది కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు ఓడించారని పేర్కొన్నారు.కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టడమే … Read more

కోదండరాం పై కెసిఆర్ కుట్రలను సాగనివ్వం.

-తెలంగాణ జనసమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిళ్ల స్రవంతి. తెలంగాణ లో కెసిఆర్ అరాచక పాలన అంతం అయినకూడా తెలంగాణ ఉద్యమ రథ సారధి ప్రొఫెసర్ కోదండరాం పై కెసిఆర్ కుట్రలు మాత్రం ఆగడం లేదని తెలంగాణ జన సమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి ఆరోపించారు.ప్రొఫెసర్ కోదండరాం ని శాసన మండలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక … Read more

బీఆర్ఎస్ పార్టీకి జమ్మికుంట కౌన్సిలర్ల రాజీనామా.

జమ్మికుంట మున్సిపాలిటీ కి చెందిన 13 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన వారిలో బొంగోని వీరన్న,మారపెల్లి బిక్షపతి, మేడిపల్లి రవీందర్,ఎలాగందుల స్వరూప,పిట్టల శ్వేత, పొనగంటి రాము,పొనగంటి సారంగం,బిట్ల కళావతి,కుతాడి రాజయ్య,దేశిని రాధ,గుళ్లి పూలమ్మ,దిడ్డి రాము,రావికంటి రాజ్ కుమార్ ఉన్నారు.మున్సిపాలిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే ల వైఖరిలు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నామని లేఖలో తెలిపారు.