టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాల్గవ మసభలు జయప్రదం చేయండి

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందకుంట మండల కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహన్ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాజరైన టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు భూపతి సంతోష్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరికిల్ల భానుచందర్ లు కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను జర్నలిస్టులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈనెల చివరి వారంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ […]
స్మార్ట్ సిటీ నిధుల్లో సునీల్ రావు 10 కోట్ల కమిషన్
కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కుంటుపడుతుందని మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడడాన్ని మేయర్ సునీల్ […]
పారా బాయిల్డ్ రైస్ మిల్లులో తనిఖీలు

శంకరపట్నం/ధనాధన్ న్యూస్: శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో గల రాజరాజేశ్వర పారా బాయిల్డ్ రైస్ మిల్లులో శనివారం ఎన్ఫోర్స్మెంట్ స్టేట్ కమిటీ తనిఖీలను నిర్వహించింది. ఈ తనిఖీలను స్టేట్ కమిటీ మెంబర్ లక్మా రెడ్డి ఆధ్వర్యంలో చేశారు.2022-23 రబీ సీజన్ కు సంబంధించి సేకరించిన ధాన్యం ప్రభుత్వానికి ఇచ్చిన ధాన్యం సరిచూడగా ఆ పారా బాయిల్డ్ రైస్ మిల్లులో మూడు లక్షల ఇరవై వేల ధాన్యం బస్తాలు ఉండాల్సి ఉండగా 1670 ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నాయని […]
అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని వివిధ ఆర్గనైజేషన్ల నాయకులను నిన్న అర్ధరాత్రి నుంచి అక్రమ అరెస్టులు చేపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడమే కాకుండా ఈరోజు ఉద్యోగాలు రాని నిరుద్యోగులు మరియు వివిధ ఆర్గనైజేషన్ల నాయకులు కలిసి ప్రశ్నించడానికి వెళుతుంటే యావత్ తెలంగాణ నలుమూలల నిరుద్యోగులను వివిధ ఆర్గనైజేషన్ నాయకులను అక్రమ […]
పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సతీమణి

రామగుండం/ధనాధన్ న్యూస్:పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలుకలపల్లి గుంటూరుపల్లి గ్రామాల్లో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పర్యటించారు.పల్లెల్లోని ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఎలాంటి సమస్యలు ఉన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు.ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు,ఫ్రీ కరెంట్,ఐదు పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని […]
సోమనపల్లి వాసికి డాక్టరేట్

అంతర్గామ్,ధనాధన్ న్యూస్:పెద్దపెల్లి జిల్లా,అంతర్గాం మండలం,సోమనపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల దామోదర్ కి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన CSIR (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) హైదరాబాద్ మరియు అకాడమీ అఫ్ ఇన్నోవాటివ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఘజియాబాద్ , న్యూ ఢిల్లీ (యూనివర్సిటీ ) నుండి ఈరోజు కెమికల్ సైన్స్ పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పొందడం జరిగింది.ప్రస్తుతం అరేజన్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో అసోసియేట్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు.దామోదర్ కి డాక్టరేట్ పొందడం వల్ల […]
హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డ్ (NQAS)ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిందని జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి తెలిపారు.గురువారం ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత తో పాటు వైద్యాధికారులు జిల్లా కలెక్టర్ ను కలిశారు.ఈ మేరకు అందుకున్న అవార్డును కలెక్టర్ కు అందజేశారు.95 శాతం అచీవ్మెంట్ సాధించినందుకు ఏరియా హాస్పిటల్ కు అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని […]
కాంగ్రెస్ పార్టీ లో చేరిన కమలాపూర్ ఎంపీపీ

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: భీమదేవరపల్లి మండలంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కమలాపూర్ మండలం ఎంపిపి తడ్క రాణి శ్రీకాంత్ గౌడ్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు 50 మందికి పైగా ముఖ్యనేతలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రణవ్ నాయకత్వం లో […]
మంత్రిని కలిసిన జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పలు వార్డులలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ అన్న రవాణా శాఖ మంత్రిని కోరడం జరిగింది.మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా నిధులు మంజూరు అయ్యేలా చేస్తానని చెప్పడం జరిగిందని జమ్మికుంట కౌన్సిలర్లు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పొనగంటి మల్లయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి,కౌన్సిలర్లు బొంగోని వీరన్న,ఎలగందుల సరూప శ్రీహరి,పిట్టల […]
విద్యాసంస్థల బంద్ విజయవంతం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: నీట్ మరియు నెట్ పరీక్షల ప్రశ్న పేపర్ల లీకేజీలను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ లో భాగంగా హుజురాబాద్ మండలం మరియు, జమ్మికుంట మండల వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఇమ్రాన్,ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా అద్యక్షులు రామారపు వెంకటేష్, సహాయ కార్యదర్శి కేశబోయిన రాము,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్,జిల్లా కార్యదర్శి అభిలాష్,గాలి నరేష్,పిడిఎస్యూ జిల్లా […]
