న్యాయం కోసం సహారా ఏజెంట్లు ఎదురుచూపు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తమకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సహారా ఇండియా ఏజెంట్లు,ఖాతాదారులు కోరారు. జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వెంటనే తమ డిపాజిట్ సొమ్ము చెల్లించాలన్నారు. సహారా సంస్థలో కోట్లాది మంది పెట్టుబడులు పెట్టారని,సుప్రీంకోర్టు వడ్డీతో సహా బాధితులకు వారి డిపాజిట్ సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమని విమర్శించారు. […]
అనాధ శరణాలయంలో రాజేష్ ఠాకూర్ జన్మదిన వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా జమ్మికుంట లోని స్థానిక స్పందన అనాధాశ్రమంలో పిల్లలతో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం జరిగింది.అనంతరం పిల్లలకు స్వీట్స్ పంపిణి చేయడం జరిగింది.రాజేష్ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ లో ఉంటూ ప్రజలకు సేవ చేయడం ప్రజలకోసం పోరాటాలు చేయడం,తన తండ్రి సీనియర్ నాయకులు దివంగత రవి ఠాకూర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రస్తుతం పార్టీలో జిల్లా స్థాయిలో ఉండడం వారి […]
క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట మడిపల్లి గ్రామంలో క్లోరోఫీల్ ఆర్గానిక్స్ వారు పత్తి మరియు వరి పొలాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.వరిలో వచ్చే మొగి పురుగు,అగ్గి తెగులు నివారణకు మరియు వరిలో అధిక పీలికలు రావడానికి వసుధ 1కేజీ మరియు క్లెన్సర్ 4కేజీ మోగి పురుకు గుళికలు వరిలో వచ్చే అగ్గి తెగులు + జింక్ + పురుగు నివారణకు మరియు పత్తి పంటలో రసం పీల్చే పురుగులకు కాయ తొలుచు పురుగులకు గోల్డ్ లీఫ్,విటమిన్ ఎస్పీ ప్రొడక్ట్స్ రైతులు […]
జగ్గయ్యపల్లిలో స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమాన్ని జగ్గయ్యపల్లిలో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని మహిళా సంఘాలతో స్వచ్చదనం గురించి అవగాహన కల్పించారు.అయిదు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామాలలో పరిశుభ్రతకు వర్షాకాలం కావడంతో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ దగ్గర వేసిన ముగ్గుల పోటీ కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమములో గ్రామ స్పెషల్ ఆఫీసర్ శైలజా దేవి,పంచాయతీ కార్యదర్శి స్వప్న ప్రియ,ఏఎన్ఎం శ్యామల,కారోబర్ రాజేశ్వర్ రావు,అంగన్వాడి టీచర్లు సంధ్య,రజిత,సీఏ […]
పేద మహిళకు తీవ్ర అనారోగ్యం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన జీవన్ కుమార్ తన భార్యకు వైద్యం చేయించడం కోసం తన స్తోమత మేరకు డబ్బులు వెచ్చించారు. ఇప్పుడు ట్రీట్మెంట్కు మరిన్ని డబ్బులు అవసరం కాగా, డబ్బులు లేక […]
రాములోరి దేవాలయానికి కూల్ వాటర్ డిస్పెన్సర్ బహుకరణ

అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి ఎల్ఐసి (జీవిత బీమా సంస్థ) ఆధ్వర్యంలో రూ 50 వేల విలువగల బ్లూ స్టార్ కూల్ వాటర్ డిస్పెన్సర్ ను విరాళంగా బహుకరించారు. అదేవిధంగా శనివారం ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ మండపంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజనల్ ఆఫీసు వారు తోడు నీడ అనే కాంపిటీషన్ నిర్వహించి విజేతలకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆదిలాబాద్ […]
ఘనంగా తల్లిపాల దినోత్సవం

వీణవంక/ధనాధన్ న్యూస్:వీణవంక మండలంలోని అంగన్వాడి కేంద్రంలో మండల సెక్టార్ ఇంచార్జ్ శ్యామలదేవి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ ఒరేం శ్రావణి తల్లిపాల దినోత్సవాల్లో భాగంగా పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలే పిల్లలకు ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ పుట్టిన పాపకు తల్లిపాలనే తాగించాలని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.
ఎస్బీఐ ఖాతాదారులకు కేంద్రం హెచ్చరిక!

న్యూస్ డెస్క్/ధనాధన్ న్యూస్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు అలర్ట్! మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండంటూ ఓ ఫేక్ మెసేజ్ తాజాగా సర్య్యూలేట్ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నకిలీ ఎస్ఎంఎస్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. వ్యక్తిగత,బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది.ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక […]
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.వృత్తి రీత్యా తాడిచెట్లు ఎక్కి జీవనం సాగించే గౌడ కులస్తులు నిత్యం ప్రమాదాలు జరగడం కొంత బాధ కలిగిస్తుందని,ఇటీవల జమ్మికుంట మండల పరిధిలోని మడిపల్లి గ్రామంలో మాచర్ల నాగేశ్వర్ గౌడ్ మృతి తీవ్ర బాధను కలిగించిందని,వారికి అండగా నిలవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక […]
నిరుపేదల నివేషణ స్థలంలో డంపింగ్ యార్డ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో సర్వే నంబర్ 275,76,77,78 లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 300 నిరుపేద కుటుంబాలకు నివేషణ స్థలం మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది.ఈ స్థలాలలో కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన వారు నిర్మాణాలు చేపట్టారు.స్తోమత లేని వారు జమ్మికుంటలో కిరాయిలలో జీవనం కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉండగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేదలకు పంపిణీ చేసిన నివేషణ స్థలాలను […]
