ప్రభుత్వ విద్యార్థుల విజ్ఞాన విహార యాత్రల కోసం స్పెషల్ బస్సులు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలకు మరియు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలకు అతి తక్కువ ఖర్చుతో టీజిస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని సూపర్ లగ్జరీ ఎక్స్ ప్రెస్ మరియు పల్లె వెలుగు వంటి బస్సులు కెపాసిటీ బట్టి వినియోగించుకోవచ్చు.ఈ అవకాశాన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వినియోగం చేసుకోవాలని,ఆర్టీసీ బస్ లో ప్రయాణం సురక్షితం అని హుజూరాబాద్ … Read more

స్థానిక ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలి

వీణవంక/ధనాధన్ న్యూస్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయాలని, పోటీకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ యువ నాయకుడు ప్రశాంత్ మద్దుల కోరారు. బుధవారం ఆయన వీణవంక మండల కేంద్రంలో  మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదికాలాలపాటు ప్రజా శ్రేయస్సుకు పనిచేయాలంటే గ్రామాల్లో యువతకు చాన్స్ ఇవ్వాలని కోరారు. యువ రక్తం హస్తం పార్టీలో ఉన్నంతగా మరే పార్టీలో లేదని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో యువతీ యువకులకు లోకల్ బాడీ … Read more

విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం స్థానిక కేసీ క్యాంపులోని మహాత్మ జ్యోతిరావు పూలే,మైనార్టీ గురుకుల పాఠశాలలో కాస్మోటిక్ చార్జీల పెంపు,కామన్ డైట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని,విద్యార్థుల సమస్యలను నేరుగా మా వద్దకు తీసుకురావాలని కోరారు.విద్యారంగ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం … Read more

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు హుజురాబాద్  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్( బాలికలు ) లో చదువుతున్న 140 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బోరగాల తిరుమల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 13 సంవత్సరముల నుండి గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా ట్రస్టు నిర్వాహకులు … Read more

రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ విజయవంతం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండల పరిధిలోని స్థానిక బస్టాండ్ ఏరియా,కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా వద్ద శనివారం రోజున,రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బందుకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలు నేడు  రాష్ట్రవ్యాప్తంగా ఆటోలను బందు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని,ఈ పథకం వలన ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి … Read more

ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు చేసిన ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: గతంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో అన్నిరకాల సౌకర్యాలు చేపడుతున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక,సైదాపూర్ మండలాల పరిధిలోగల ఎంజెపిబిటి బాలుర పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు.అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వసతులపై ఆరాతీసి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.గతానికంటే భిన్నంగా విద్యార్థుల డైట్ విషయంలో అనేక రకాల చర్యలు … Read more

పోగొట్టుకున్న 50 సెల్ ఫోన్లు స్వాధీనం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ డివిజన్ పరిధిలో గత కొంతకాలంగా సెల్ ఫోన్ పోగొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం  సాంకేతిక పరిజ్ఞానాన్ని (CEIR portal) ఉపయోగించి సుమారు 50  ఫోన్లు కనిపెట్టి బుధవారం హుజురాబాద్ ఏసీపీ  కార్యాలయంలో ఫోన్లు తిరిగి బాధితులందరికీఅందజేశారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుంటే దొంగిలించిన ఫోన్లతో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే ఆస్కారం ఉంటుందని అన్నారు. … Read more

కెసిఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనివ్వను

వరంగల్/ధనాధన్ న్యూస్: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ గడ్డపై కాళోజీ కళాక్షేత్రాన్ని పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నాతాను అధికారంలోకి రాగానే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి ఇవాళ ప్రారంభిం చడం జరిగిందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేయకపోగా,అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్న వారి కాళ్లలో కట్టెలు పెడుతోందన్నారు. కెసిఆర్ చేసిన అప్పులకు వేలకోట్లలో వడ్డీ కష్టమని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, కెసిఆర్ అనే … Read more

డ్రగ్స్ తో భవిష్యత్తు అంధకారం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం కాన్షియస్ నెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు బొట్ల రామస్వామి అధ్యక్షతన పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వినోద్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడడం ద్వారా అనారోగ్యానికి గురవుతామని అన్నారు.విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డ్రగ్స్ తో భవిష్యత్తు అంధకారం అవుతుందని హుజురాబాద్ ఎక్సైజ్ ఎస్ఐ వినోద్ కుమార్ అన్నారు.డ్రగ్స్ కు అలవాటు పడి డ్రగ్స్ కోసం … Read more

మత్స్యకారులపై ప్రభుత్వానికి ఇంత వివక్ష ఎందుకు?

కమలాపూర్/ధనాధన్ న్యూస్: గత ప్రభుత్వంతో పోల్చుకుంటే సగం కూడా చేపల పంపిణీ చేయలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారులకు పంపిణీ చేయాల్సిన చేపల విషయంలో పూర్తిగా వివక్ష చూపిస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శనివారం హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలం లో చేపల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు.  హుజురాబాద్ నియోజకవర్గం లో 283 చెరువులు ఉన్నాయని అన్నారు. గతంలో కమలాపూర్ లో 16 లక్షల చాపలు … Read more