తెలంగాణ చేనేత ఐక్య వేదిక నియోజకవర్గ అధ్యక్షులుగా కుడికాల సాయి.

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లా మరియు మండల కమిటీలనిర్మాణం లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి యువజన నాయకుడుమరియు రిపోర్టర్ కుడికాల సాయినిహుజూరాబాద్ నియోజకవర్గ తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్బంగా కుడికాల సాయి మాట్లాడుతూ నియోజకవర్గం లోని పద్మశాలి జాతి శ్రేయస్సు కోసం చేనేత కార్మికుల పరిరక్షణ కోసం నిరంతరం … Read more

ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని లాంచ్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం.

-ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ మీడియా పాత్ర కీలకం. -వార్తకోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. -ఎప్పటి వార్తలు అప్పుడే చూసుకోవచ్చు. -ప్రజా సమస్యలపై ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు వారధి ఉండాలే. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ లో జరిగిన పీవి హుజురాబాద్ జిల్లా సాధన సదస్సు కార్యక్రమానికి తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని ఆయన లాంచ్ చేశారు.ఈ సందర్బంగా … Read more

మేడారం మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహా జాతర పోస్టర్‌ను శనివారం సాయంత్రం ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు ఉన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. సమ్మక్క – సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. భక్తులకు ఇబ్బంది … Read more

రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్ళలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించా లని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం … Read more

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నేత మల్లికార్జున రాజేందర్

మంత్రి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.మంత్రి పొన్నం ప్రభాకర్,మాజీ యం.ఎల్.సి టి.సంతోష్ కుమార్ బిఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి పదవులతో పాటు కార్పొరేటర్ గా అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ గూటికి చేరడం సంతోషంగా ఉందని, … Read more

రేపు తెలంగాణ జిల్లాలలో అమిత్ షా పర్యటన.

రేపు బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంట సమయంలో కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల ఆఫీస్ బేరర్స్ తో … Read more

విడాకులు నన్ను ఎంతో బాధించాయి.

వివాహం జరిగిన మూడేళ్లలోనే విడాకులు తీసుకోవడంపై నటి నిహారిక స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. విడాకులకు ముందు, తర్వాత ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడారు.అది తనకెంతో క్లిష్టమైన దశ అన్నారు. బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు.మాది ప్రేమ వివాహం కాదు.వివాహం,ఆ వెంటనే విడిపోవడం ఎంతో క్లిష్టంగా ఉంటుంది.పెళ్లి అనేది చిన్న విషయం కాదు, జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఎవరైనా వివాహం చేసుకుంటారు.నేనూ అదే ఆశతో అడుగులు వేశా అనుకున్నవిధంగా పరిస్థితుల్లేవు.సులభంగా మనుషులను నమ్మకూడదనే … Read more

పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన గంజాయి స్మగ్లర్లు.

మహబూబాబాద్‌లో శుక్రవారం విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.ఆంధ్ర ఒరిస్సా సరిహద్డులో గంజాయి ప్యాక్ చేసుకున్న స్మగ్లర్లు కారులో హైదరాబాద్ కు తరలిస్తున్నారు.హైవే మీదుగా వెళ్తే పోలీసులు పట్టుకుంటారని అడ్డదారిలో వెళ్తున్న ఈ క్రమంలోనే వాళ్ల రూట్ మ్యాప్ లో ఊహించని ట్విస్ట్ ఎదురయింది.. నెల్లికుదురు సమీపంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు.ఆ మార్గంలో వెళుతున్న స్మగ్లర్లు.ఎక్సైజ్ సిబ్బందిని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ల ప్రయత్నం బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోయారు. కారు … Read more

లారీ డ్రైవర్స్ క్లీనర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

జమ్మికుంట పట్టణ లారీ డ్రైవర్స్ క్లినర్స్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతకాన్ని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పొనగంటి మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పొనగంటి మల్లయ్య మాట్లాడుతూ లారీ డ్రైవర్లకు క్లీనర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముద్రవేణి రవి ఉపాధ్యక్షులు గాజ శంకర్ప్ర,ధానకార్యదర్శి మారపల్లి సుమన్,కోశాధికారి సొల్లేటి రఘు,కార్యదర్శి కంకటి రవి, సలహాదారులు రాచపల్లి … Read more

బెస్ట్ ఎంప్లాయ్ గా అసిస్టెంట్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్.

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్ ను బెస్ట్ ఎంప్లాయ్ గా విద్యుత్ శాఖ సూపర్డెంట్ గంగాధర్ ఎంపిక చేశారు.ఈ యొక్క అవార్డు జమ్మికుంట టౌన్ ఏ ఈ సురేశ్వర చారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ మారేపల్లి సంజీవరావు,సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సంపత్, లైన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి,లైన్మెన్ ఐలేష్ ,కనకయ్య,సుదర్శన్ అసిస్టెంట్ లైన్మెన్ మహేందర్ రెడ్డి,సంపత్, శ్రీనివాస్,రాధాకృష్ణ జూనియర్ … Read more