దళితబందు రెండవ విడత ఎప్పుడు ఇస్తారో జిల్లా మంత్రి ప్రకటన చేయాలి

హుజురాబాద్ నియోజకవర్గం లోని పైలెట్ ప్రాజెక్టు అయినటువంటి దళితబందును రెండవ విడతను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పూర్తిస్థాయిలో మంజూరు చేస్తుందో జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటన ద్వారా తెలపాలని హుజురాబాద్ నియోజకవర్గ దళితబందు సాధన సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు.గత బి అర్ ఎస్ ప్రభుత్వం దళితబందు పూర్తిస్థాయిలో మంజూరు చేయడంలో విఫలం అయిందని రెండవ విడత కోసం 18 నెలలుగా ఎదురు చూస్తున్న దళితులకు అన్యాయం చేశారని,ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయిన … Read more

దళిత బందు ఇచ్చేది పక్కా కాంగ్రెస్ ప్రభుత్వమే

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో “దళిత బంధు” రెండో విడత అమలును ఆపింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్,అప్పటి ఎమ్మెల్సీ,ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని  ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “దళిత బందు” సాధన కమిటీ నాయకుల ప్రకటనల వల్ల దళిత బంద్ లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వంను బద్నామ్ … Read more

మా వెనుక ఎవరూ లేరు

జమ్మికుంట దళిత బంధు సాధన కమిటీ నాయకులు జమ్మికుంట ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు లబ్ధిదారులైన తాము రెండో విడత దళిత బంధు సాధనకై ప్రజావాణిలో కలెక్టర్ కు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా అక్కడి నాయకులు తప్పుడు సమాచారం ఇచ్చి తమను అక్రమంగా అరెస్టు చేసి కనీసం మహిళలు,వృద్ధులు అని కూడా చూడకుండా సిటిఎస్ కు తరలించారు.తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కానీ స్థానిక … Read more

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈరోజు జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన పలువురు ఇసుక ట్రాక్టర్ యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తూ అడ్డుకుంటున్న పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన విలాసాగర్ గ్రామానికి … Read more

కరీంనగర్ ను కరప్షన్,కలెక్షన్ కు కేరాఫ్ గా మార్చారు

కరీంనగర్,ధనాధన్ న్యూస్: కళకళలాడే కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ పుణ్యమాని, అవినీతి,అక్రమాలకు నిలయంగా,కరప్షన్ కలెక్షన్ కు కేరాఫ్ గా మారిందని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.2014 నుంచి నిన్నటి వరకు జరిగిన భూమాఫియా ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా గుట్కా మాఫియా మట్కా మాఫియా జట్కా మాఫియా నడిపింది,బిఆర్ఎస్ నేత లేనని వీరందరూ … Read more

పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే తాట తిస్తాం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే ఉరుకునేది లేదని హుస్నాబాద్ నియెజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల శ్రీనివాస్ ఒక ప్రకటన లో హెచ్చరించారు.ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డి కి లేదని అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నరని ఎద్దేవా చేశారు.ఉద్యమం ద్రోహి కౌశిక్ రెడ్డి అని ప్రజలను బ్లాక్ మెయిల్ … Read more

పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు

మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యల చేస్తే ఊరుకునేలేదని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్ హెచ్చరించారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విమర్శించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డి కి లేదని అన్నారు. ఉద్యమ ద్రోహి అయిన నువ్వు ఉద్యమ నాయకులపై విమర్శలు చెయ్యడం సిగ్గు చేటని అన్నారు. భార్య, … Read more

మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడం

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడే వాళ్ళం కాదని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని తన నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేశ్వర్ రావు మాట్లాడుతూ మంగళవారం తాను ఒక ఫంక్షన్ కి వెళ్లగా తనకి కౌన్సిలర్ రాజు తనకు ఎదురై తనకు అవహేళన చేస్తూ తనని ఇబ్బందులకు గురిచేశాడని తెలిపారు.తన పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన వినకుండా ప్రజల్లో తనని చులకన చేసేలా ప్రవర్తించడని తెలిపారు.ఇంత ముందు తనపై అవిశ్వాసం పెట్టె … Read more

పీవీ నరసింహారావుకు భారతరత్న పట్ల హర్షం

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.దక్షిణ భారతదేశం నుంచి తెలుగు రాష్ట్రం నుండి ఏకైక ప్రధానిగా కొనసాగి దేశాన్ని ఆర్థిక లోటు నుంచి ఎదుగుతున్న దేశంగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. సంస్కరణల పితామహునిగా పేరుపొంది భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన … Read more

దళిత బంధు బాధితుణ్ణి పరామర్శించిన బండ శ్రీనివాస్.

దళితబందు రెండవ విడత మంజూరు కావడం లేదని అప్పులు బాగా కావడంతో మనస్థాపనికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన బోడికెల శ్రీనివాస్ అనే వ్యక్తి ని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బంద్ రెండవ విడత వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అలాగే బాధితుని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో టంగుటూరి … Read more