రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ విజయవంతం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండల పరిధిలోని స్థానిక బస్టాండ్ ఏరియా,కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా వద్ద శనివారం రోజున,రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బందుకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలు నేడు  రాష్ట్రవ్యాప్తంగా ఆటోలను బందు చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని,ఈ పథకం వలన ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి … Read more

నూతన మార్కెట్ కార్యదర్శి మల్లేశంకు సహకరిస్తాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా బదిలీపై వచ్చిన ఆర్. మల్లేశంకు సంపూర్ణంగా సహకరిస్తామని జమ్మికుంట అడ్తిదారుల సంఘం, దాడ్వాయిల  సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘం భవనంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న గుగులోతు రెడ్యా నాయక్ కు వీడ్కోలు పలుకుతూ.. నూతన కార్యదర్శి మల్లేశంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీగా సమస్తవంతంగా రెడ్డి నాయక్ పని చేశారని … Read more

డయాగ్నొస్టిక్,స్కానింగ్ సెంటర్లు అధిక ఫీజులను నియంత్రించాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి డయాగ్నస్టిక్ సెంటర్,స్కానింగ్ సెంటర్ లు అధిక ధరలు పెంచి  మధ్యతరగతి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న స్కానింగ్ సెంటర్ ల యాజమాన్యలపైన విచారణ చేయాలని పెరిగిన స్కానింగ్ ఫీజులను తగ్గించాలని ఆయనకోరారు.సోమవారం రోజున  అధిక ఫీజులు తగ్గించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ కరీంనగర్ లో విచ్చల విడిగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆఫర్ ల  పేరుతో … Read more

భూ ఆక్రమణలపై కలెక్టర్ కు పిర్యాదు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని మాజీ సర్పంచ్ తన కుటుంబ సభ్యుల పేరున అక్రమ పట్టా చేసి ఆక్రమించుకున్నాడని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గ్రామ శివారు లోని మసీదు దగ్గర భూమిని పూర్వం అంబేద్కర్ భవనం,ప్రాథమిక పశువుల వైద్యశాలకు కేటాయించిన  భూమిని ఇందిరా సుధీర్ కుమార్ గౌడ్ సర్పంచ్ పదవిలో కొనసాగుతూ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి సర్వేనెంబర్ 399/ఆ  లో సుమారు … Read more

వేసవి తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలను సీజ్ చేయాలి

ధనాధన్ న్యూస్ మే23: బోర్డ్ నిబంధనలను ఉల్లంగిస్తూ అక్రమంగా నడిపిస్తూ వేసవి తరగతులు నిర్వహిస్తున్న కరీంనగర్ నగరంలోని ప్రైవేట్ కళాశాలల ను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంటర్ బోర్డ్ నిబంధనలను భేకాతరు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డ్ విఫలం చెందిందని బోనగిరి మహేందర్ బ్రాహ్మణపల్లి యుగంధర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు బోనగిరి మహేందర్, ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ పెళ్లి యుగంధర్ మాట్లాడుతూ … Read more

ఉపాధిహామీ కూలీలకి యోగ శిక్షణ

మహాముత్తారం(ధనాధన్ న్యూస్)మే22:మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో జాతీయ ఉపాధిహామీ కూలీలకి జాతీయ యోగ శిక్షణ అధ్యాపకుడు వావిల్ల కిష్టయ్య శిక్షణ ఇస్తూ యోగ వలన జరిగే ప్రయోజనాలను కూలీలకి వివరించడం జరిగింది.ప్రతిరోజూ ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వలన మనిషిని పట్టిపిడిస్తున్న  సైకో సోమటిక్ వ్యాధులు మానసిక వ్యాధులు భయం, కోపం,భద్రత భావము మొదలైన వ్యాధులను నయం చేయవచ్చునని,కరోన,గుండె సంబంధిత వ్యాధులు ధ్యానం తో నయం చేయవచ్చునని ఉపాధి హామీ కూలీలకి పని సామర్ధ్యమును పెంచడంతో పాటు … Read more

అంగ రంగవైభవంగా ద్వితీయ వార్షికోత్సవం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే15:జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేడుకల్లో భాగంగా మంగళవారం నాడు ఉదయం విశ్వక్ సేన ఆరాదన,పుణ్యవచనం,రక్షా బంధనం,నవ కలుష స్థపనం,మహా హోమం తో ప్రారంభమై సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవం అధ్యంతం వైభవంగా,కన్నుల పండుగగా జరిగింది.రాములోరి కల్యాణానికి దాతలు పట్టు వస్త్రాలు,పూలు సమర్పించారు.అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.కళ్యాణ వేడుకతో గ్రామమంతా రామనామస్మరణతో మారూమ్రోగింది.ప్రతీ … Read more

ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపిస్తే మీ తోడుగా మేమిద్దరం ఉంటాం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఎవరికి అమలు చేశారో కూడా చెప్పాలన్నారు.మహిళలకు 2500 పెన్షన్, … Read more

మోదీ గుండెలో బండికి ప్రత్యేక స్థానం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుండెలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు.బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు.సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు.జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు … Read more

నూజివీడు సీడ్స్ నూతన వంగడం క్షేత్ర ప్రదర్శన

రామడుగు(ధనాధన్ న్యూస్)ఏప్రిల్25:రామడుగు మండలంలోని వెధిర గ్రామంలో బుధవారం రోజున నూజివీడు సీడ్స్ కంపెనీ వరి పుష్కల్ (ఎన్ పి 9153) దొడ్డు రకమును గ్రామానికి చెందిన వాసు రావు వ్యవసాయ పొలంలో రైతులతో క్షేత్రస్థాయి ప్రదర్శన  నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కంపెనీ సీనియర్ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పుష్కల్ వరి వంగడం మిగతా రకాల వరి వంగడాల కంటే నాలుగైదు క్వింటాలు అధిక దిగుబడి వస్తుందని అన్నారు.ఈ రకం వానాకాలం,యాసంగి రెండు కాలాలకు … Read more