ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్ రావు 93వ జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల రాజేశ్వర్ రావు విగ్రహానికి  వారి కుమారులు కిషన్ రావు,శ్రీనివాస రావు,హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు,కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.పేదల పక్షాన నిలబడి వారికి కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేశాడని,గల్లి నుండి ఢిల్లీ వరకు … Read more

యశ్వంత్ మృతి అత్యంత బాధాకరం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇంటర్ విద్యార్థి విద్యుద్ఘాతంతో మృతి చెందడం అత్యంత బాధాకరమని ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ తెలిపారు. శనివారం ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనతో ఊరంతా విషాదచాయలు నెలకొన్నాయని పేర్కొన్నారు.ఈ దుర్ఘటనపైన చింతిస్తూ,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వెంకట్ తెలిపారు.ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాల్లో నవరాత్రుల కోసం మండపాల అలంకరణ,నిమజ్జనం సమయాల్లో నిర్వాహకులు తగు జాగ్రత్తలు … Read more

హుజురాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రక్షా బంధన్ సందర్భంగా సమాజంలో సోదర భావం మరింత పెంపొందాలని,హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.మహిళల రక్షణ పట్ల,మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించామని,ఉచిత బస్ సౌకర్యం ద్వారా అనేకమంది స్త్రీలు లబ్ధి పొందారని అన్నారు.అలాగే రాబోయే రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల … Read more

సోదరభావం,పవిత్రతే రక్షాబంధన్ సందేశం

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెదలాలనే సందేశాన్ని తెలియజేయడమే రక్షాబంధన్ ఉద్దేశ్యమని బ్రహ్మకుమారీలు  కల్పన, శ్రీవాణి అన్నారు. శుక్రవారం రాఖీ పండగ విశిష్టతను వివరిస్తూ పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పలువురికి రాఖీలు కట్టారు. రాఖీ యొక్క విశిష్టతను తెలియజేస్తూ అక్కా చెల్లెలు, అన్నదమ్ముల బంధం గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడారు.సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో ప్రతి పండుగ పరమాత్ముని అవతరణ, దివ్య కర్తవ్యాన్ని సూచిస్తుందన్నారు. రక్షణ అంటే విలువలను పెంపొందించుకోవడం, … Read more

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి నలుగురు డాక్టర్ల నియామకం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో వైద్యులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి ప్రణవ్ త్వరితగతిన వైద్యులను నియమించాలని జిల్లా కలెక్టర్ ను కోరగా స్పందించిన కలెక్టర్ ఏరియా హాస్పిటల్ కు నలుగురు వైద్యులు నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడించారు.హుజురాబాద్,జమ్మికుంట ఆసుపత్రులకు 15 లక్షల రూపాయలను వాటి అభివృద్ధి కొరకు కేటాయించేలా కృషి చేశారు.ఆసుపత్రులకు నిత్యం అనేకమంది రోగులు వస్తుంటారు,వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని … Read more

వర్షాకాలంలో వైరల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో డెంగ్యూ,మలేరియా లాంటి వైరల్ జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ఆ భాధ్యత ఆయా మండలాల ఎంపిడిఓలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.జమ్మికుంట,హుజురాబాద్ మున్సిపల్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కోరారు.ప్రతీ ఒక్కరూ ఇంటి పరిసరాల్లో చెత్త,నీరు నిల్వఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.అంతేకాకుండా గ్రామాల్లో పారిశుధ్యంపై ఎంపిడిఓలు ఆయా శాఖల అధికారులతో సమన్వయపరుస్తూ ప్రత్యేక దృష్టి పెట్టాలని,మిషన్ … Read more

సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ఈ నెల 18వ తారీఖున జరిగే సర్వాయి పాపన్న 374 వ జయంతి గ్రామ,గ్రామాన వాడవాడల ఘనంగా నిర్వహించాలని సర్వాయి పాపన్న కీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పూదరి విజయ్ పిలుపునిచ్చారు.జమ్మికుంట పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమల్లు గౌడ్ పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ బడుగు,బలహీనుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న … Read more

ప్రతి పథకం ప్రజలకు చేరడమే ప్రభుత్వ ధ్యేయం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలో రైతువేదికలో  అగ్రికల్చర్ ఆఫీసర్ వైదేహి అధ్యక్షతన నిర్వహించిన వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వివిధ విభాగాల అధికారులురైతులు పెట్టుబడి తక్కువగా ఉండి అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని, పాడి పశువుల పోషణ,చేపలు పెంపకం,పండ్ల, గొర్రెలు,నాటు కోళ్లు,తోటలు,ఆయిల్ ఫాం,డ్రాగన్ ఫ్రూట్,పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమం … Read more

కబ్జా భూమిపై ఆఫీసర్ల సర్వే

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలో ఉన్న సర్వే నం.467లో గల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించిన ఘటనపై అధికారులు కదిలారు.శుక్రవారం జమ్మికుంట తహశీల్దారు జి.రమేష్ బాబు ఆధ్వర్యంలో డివిజన్ డీఐ ఫయాక్ అలీ జమ్మికుంట సర్వేయర్ మనోజ్‌తో పాటు పలువురు సిబ్బంది స్థలాన్ని సర్వే చేయడానికి వెళ్లారు.గత కొద్దిరోజులుగా వివిధ దినపత్రికల్లో వస్తున్న వార్తలతో పాటు పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త గుర్రపు మహేందర్‌గౌడ్ తహశీల్దార్‌కు ఈ … Read more

న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: జనగామ పట్టణంలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హుజురాబాద్ కోర్టు ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని,న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిని వ్యతిరేకిస్తూ గురు,శుక్రవారాలు న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియన్ ప్రధాన … Read more