విద్యార్థులు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్చదనం పచ్చదనము కార్యక్రమాన్ని రెండవ రోజు కళాశాల ప్రిన్సిపాల్ మహేందర్ కుమార్  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కరీంనగర్ ఇంటర్మీడియట్ విద్య అధికారి (డిఐఈఓ) జగన్మోహన్ రెడ్డి హాజరై కళాశాలలో మొక్కలు నాటినా తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 86వ జయంతి సందర్బంగా పూలమాలవేసి నివాళి అందించాడు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఐఈఓ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల మొక్కలు నాటడముతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత … Read more

నూతన మార్కెట్ కార్యదర్శి మల్లేశంకు సహకరిస్తాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా బదిలీపై వచ్చిన ఆర్. మల్లేశంకు సంపూర్ణంగా సహకరిస్తామని జమ్మికుంట అడ్తిదారుల సంఘం, దాడ్వాయిల  సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘం భవనంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న గుగులోతు రెడ్యా నాయక్ కు వీడ్కోలు పలుకుతూ.. నూతన కార్యదర్శి మల్లేశంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీగా సమస్తవంతంగా రెడ్డి నాయక్ పని చేశారని … Read more

పేద మహిళకు తీవ్ర అనారోగ్యం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన జీవన్ కుమార్ తన భార్యకు వైద్యం చేయించడం కోసం తన స్తోమత మేరకు డబ్బులు వెచ్చించారు. ఇప్పుడు ట్రీట్‌మెంట్‌కు మరిన్ని డబ్బులు అవసరం కాగా, డబ్బులు లేక … Read more

ఘనంగా తల్లిపాల దినోత్సవం

వీణవంక/ధనాధన్ న్యూస్:వీణవంక  మండలంలోని అంగన్వాడి కేంద్రంలో మండల సెక్టార్ ఇంచార్జ్ శ్యామలదేవి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ ఒరేం శ్రావణి తల్లిపాల దినోత్సవాల్లో భాగంగా పిల్లలకు అన్నప్రాసన  కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలే పిల్లలకు ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ పుట్టిన పాపకు తల్లిపాలనే తాగించాలని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.వృత్తి రీత్యా తాడిచెట్లు ఎక్కి జీవనం సాగించే గౌడ కులస్తులు నిత్యం ప్రమాదాలు జరగడం కొంత బాధ కలిగిస్తుందని,ఇటీవల జమ్మికుంట మండల పరిధిలోని మడిపల్లి గ్రామంలో మాచర్ల నాగేశ్వర్ గౌడ్ మృతి తీవ్ర బాధను కలిగించిందని,వారికి అండగా నిలవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక … Read more

మాజీ జెడ్పిటిసి కుటుంబాన్ని పరామర్శించిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికీ చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ జెడ్పిటిసి గుండారపు శోభ శ్రీనివాస్ తల్లి గుండారపు కనకమ్మ ఇటీవల మరణించడంతో  కుటుంబాన్ని మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కౌన్సిలర్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ,మాజీ ఎంపిటిసి చాడా చైతన్య కొండల్ రెడ్డి,మాజీ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్,గ్రామ అధ్యక్షులు తాళ్లపెళ్లి వెంకటేశం,యూత్ కాంగ్రెస్ నాయకులు పూదారి హరీష్ గౌడ్,బోనగిరి అనిల్,మాడెపు రాహుల్ … Read more

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 13వ వర్థంతి

రాజకీయ దురంధరుడు,స్నేహశీలి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు ఆశలను కొనసాగించడమే తన లక్ష్యమని,వారసత్వంగా వచ్చిన ప్రజల ప్రేమాభిమానలు పొంది వారికి సేవ చేస్తాననీ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు,మానకొండూర్ మాజీ శాసన సభ్యుడు ఆరపల్లి మోహన్ పాల్గొన్నారు.ఈ … Read more

వరద బాధితులను ఓదార్చిన వోడితల ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని 23వ వార్డు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది.ఈ కాలనీలో దాదాపు 300 మంది బుడగ జంగాల ప్రజలు,పిల్లాపాపలతో గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాల నుండి నిరుపేద జీవితాలను గడుపుతున్నారు.నిన్న మొన్నటి భారీ వర్షాల వల్ల అనేక గుడిసెలపై గల తాత్కాలిక పైకప్పులు కొట్టుకుపోగా దాదాపు మొత్తం గుడిసెలు సగం నీటిలో కూరుకుపోవడంతో వస్తువులు, దుస్తులు,పక్క బట్టలు,రేషన్ బియ్యం ఇతర … Read more

క్రీ.శే.బెజగం చంద్రమౌళి చూపు సజీవం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి నివాసి అయిన బెజగం చంద్రమౌళి ఈ నెల 21 రోజున రాత్రి మృతి చెందడం జరిగింది.సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి  నేత్రదానంపై అవగాహన కల్పించగా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో, వరంగల్  ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్ కి పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన  కుమారుడు కోడలు బెజగం రమేష్,జ్యోతి లకు,కూతుర్లు అల్లుండ్లు రజిత,సుధాకర్ … Read more

రైతు ఋణమాఫి పట్ల యువజన కాంగ్రెస్ సంబరాలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు బ్యాండు భాజాలతో, టపాసులు కాల్చి మిఠాయిలు పంచినృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు  మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన మరియు యువజన కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.రైతు రుణ మాఫీకి కృషిచేసిన … Read more