రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ నియోజకవర్గం లోని రైతు వేదికలు సంబరాలకు ముస్తాబవుతున్నాయని,ఇచ్చిన హామీలను నెరవేర్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని,రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  వోడితల ప్రణవ్ అన్నారు.గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లోని రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు,రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ … Read more

అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో సోమవారం రాత్రి జరిగినటువంటి అగ్నిప్రమాదం చాలా బాధాకరమని నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం అగ్నిప్రమాదం జరిగిన చోటును ప్రణవ్ పరిశీలించారు.ఈ సందర్బంగా తమ జీవనాధారమైన షాపులను కోల్పోవడం జరిగిందని ప్రణవ్ ముందు ఆవేదన చెందగా వారికి నేనున్నా అని ధైర్యం చెప్పి ఓదార్చారు.అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలను చిరు వ్యాపారస్తులతో,అధికారులతో మాట్లాడి,బాధితులకు న్యాయం జరిగేలా మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వంతో మాట్లాడి … Read more

భ్రూణ హత్యలకు పాల్పడుతున్న ఆసుపత్రులపై చర్యలు చేపట్టాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్,జమ్మికుంట పట్టణాల్లో విచ్చలవిడిగా ఆసుపత్రులు వెలిసాయని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ ఒక్క హాస్పటల్ లేదని పేదప్రజల ఆరోగ్యాన్ని ఆసరాగా చేసుకుని వేలాది రూపాయలు దండుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు టేకుల శ్రావణ్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్,జమ్మికుంట కేంద్రాలుగా భ్రూణ హత్యలు పెరిగాయని జిల్లా వైద్య శాఖ అధికారులు వాటిని అరికట్టడంలో చూసిచూడనట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు.హుజురాబాద్,జమ్మికుంట లో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఏర్పాటు … Read more

హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ అవార్డ్ (NQAS)ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిందని జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి తెలిపారు.గురువారం ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత తో పాటు వైద్యాధికారులు జిల్లా కలెక్టర్ ను కలిశారు.ఈ మేరకు అందుకున్న అవార్డును కలెక్టర్ కు అందజేశారు.95 శాతం అచీవ్‌మెంట్ సాధించినందుకు ఏరియా హాస్పిటల్ కు అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని … Read more

కాంగ్రెస్ పార్టీ లో చేరిన కమలాపూర్ ఎంపీపీ

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: భీమదేవరపల్లి మండలంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి  వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కమలాపూర్ మండలం ఎంపిపి తడ్క రాణి శ్రీకాంత్ గౌడ్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ  నుండి దాదాపు 50 మందికి పైగా ముఖ్యనేతలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రణవ్ నాయకత్వం లో … Read more

అలరించిన బాలసభ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లి లో జరిగిన బాలసభ సాంస్కృతి కార్యక్రమాలు అందరిని అలరించాయి.తెలంగాణ ప్రభుత్వము విద్యాశాఖ వారు విద్యార్థులను సాంస్కృతికంగా సాహిత్య పరంగా అభివృద్ధిపరిచేందుకై ప్రతినెల నాలుగవ శనివారము ‘నో బ్యాగు డే’ను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్న సృజణాత్మకత శక్తులను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమము ఉపకరిస్తుందని విద్యార్థిని విద్యార్థులు బాలసభను ఉపయోగించుకొని చక్కటి సాంస్కృతిక నిర్వహించాలని కవితలు,గేయాలు,పాటలు వినిపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు చేసిన దేశభక్తి … Read more

కౌశిక్ రెడ్డిని విమర్శించే స్థాయి ప్రణవ్ ది కాదు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్13: హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ని విమర్శించే స్థాయి ప్రణవ్ కి లేదని బీఆర్ఎస్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి అన్నారు. గురువారం హుజరాబాద్ లోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వారం రోజులుగా ఫ్లై యాష్ స్కాం గురించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కనుసన్నలోనే స్కామ్ జరుగుతుంది అని ఆధారలతో నిరూపిస్తే ఇప్పటివరకు మంత్రి ఎందుకు స్పందించడం లేదని … Read more

హుజురాబాద్ లో కాంగ్రెస్ కు మెజారిటీ

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్04:ఈరోజు వెలువడినటువంటి లోక్ సభ ఫలితాల్లో ఆశించిన ఫలితం రాకపోయినా బీజేపీ,బిఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టి గట్టి పోటీ ఇచ్చామని హుజురాబాద్ నియోజక వర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ అన్నారు.హుజురాబాద్ నుండి అద్భుతమైన మెజారిటీ ప్రజలు ఇచ్చారని దీనికి నియోజకవర్గ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. హుజురాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నా కూడా బిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసినందుకు,పార్టీపై నాపై ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ,ఎంపీ అభ్యర్థి … Read more

దుద్దెనపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్02:సైదాపూర్ మండలంలోని దుద్దేనపల్లి గ్రామంలో ఆదివారం రోజున ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.కుల పెద్దమనిషిగా గూళ్ల వెంకటయ్య,ప్రెసిడెంట్ గా నెల్లి శ్రీనివాస్,క్యాషియర్ గా నీల తిరుపతి,వైస్ ప్రెసిడెంట్ గా రొయ్యల శ్రీనివాస్, మెంబర్లు గా బొల్లి సురేష్,గూళ్ల అజయ్,పిట్టల కొమురయ్య,పిట్టల మొండయ్య,పెసరి సమ్మయ్య,నీల సమ్మయ్య లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి నా ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా … Read more

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)జూన్01:హనుమాన్ జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో హనుమాన్ మాల ధారణ స్వాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయమే స్వామీకి ప్రత్యేక అభిషేకం చేశారు.అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.అభిషేకం చేసే సమయంలో రాముని భజన,రామ నామ స్మరణతో భక్తులు తన్మయత్వం పొందారు.జయంతి సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు ఆలయాన్ని సందర్శించి ప్రత్యెక మొక్కులు చెల్లించుకున్నారు.విరుముడి కట్టుకొని హనుమాన్ మాల ధారణ స్వాములు విరమణకు బయలుదేరారు.అనంతరం మహా … Read more