ధనాధన్ న్యూస్ లో ప్రచురితమైన కథనానికి స్పందన

సైదాపూర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న గోనెసంచుల సమస్యపై ధనాధన్ న్యూస్ తెలుగు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. రైతులకు గోనెసంచులు అందించేందుకు నిరాకరించిన యజమాని, వార్త ప్రచురితమైన అనంతరం మంగళవారం ఉదయం వెంటనే సంచులు అందజేయడం ప్రారంభించారు.


ఇప్పటివరకు “మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ రైతుల సమస్యను పట్టించుకోని యజమాని వైఖరిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ధనాధన్ న్యూస్‌లో కథనం వెలువడిన తర్వాత అధికారులు, సంబంధిత యజమానులు స్పందించడంతో రైతులకు ఊరట లభించింది.


తమ సమస్యను ప్రజల ముందుకు తీసుకువచ్చి పరిష్కారానికి మార్గం సుగమం చేసిన ధనాధన్ న్యూస్ దినపత్రిక ప్రతినిధికి మొక్కజొన్న రైతులు కృతజ్ఞతలు తెలిపారు. “మీడియా స్పందించకపోతే మా సమస్య ఇంకా కొనసాగేదే” అంటూ రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a comment