ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తా: వొడితల ప్రణవ్

జమ్మికుంట,ఆగస్టు 5 (ధనాధన్ న్యూస్): అర్హులైన ప్రతి లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.బుధవారం జమ్మికుంట పట్టణంలోని 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 14, 15, 24, 28 వార్డుల్లో నిర్వహించిన “ప్రతి గడపకు సంక్షేమం – ప్రజల వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22 […]

మాతృత్వానికి మానవత్వం జోడించిన ఓం శ్రీ సాయి హాస్పిటల్

జగిత్యాల, ఆగస్టు 3 (ధనాధన్ న్యూస్): వైద్యం అంటే కేవలం చికిత్స మాత్రమే కాదు.. సేవ, మానవత్వం, ఆప్యాయత కూడా కలిసినప్పుడే అది సంపూర్ణమవుతుంది. ఈ మాటలను నిజం చేస్తూ జగిత్యాల పట్టణంలోని ఓం శ్రీ సాయి హాస్పిటల్ ప్రసూతి సేవల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చే ప్రతి తల్లికి, నవజాత శిశువుకు అవసరమైన వస్తువులతో కూడిన ఉచిత బేబీ కిట్‌ను అందజేస్తూ మాతృత్వానికి మధుర జ్ఞాపకాన్ని అందిస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన కేసీఆర్ […]

కరీంనగర్‌లో నూతన సిటీ బస్ సర్వీసుల ప్రారంభం

కరీంనగర్/ధనాధన్ న్యూస్: నగర ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో కరీంనగర్ నుంచి చింతకుంట, కొత్తపెళ్లి హవేలీ, వాగేశ్వరి కాలనీలకు నూతన సిటీ బస్ సర్వీసులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు మెరుగైన ప్రజా […]

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల/ధనాధన్ న్యూస్ (జిల్లా ప్రతినిధి రాజా రెడ్డి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో గురువారం జూమ్ సమావేశం నిర్వహించి వర్షాల పరిస్థితిపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని […]

సమస్యల నిలయంగా మాదారం ఆశ్రమ పాఠశాల

మహాముత్తారం, జూలై 30(ధనాధన్ న్యూస్): మండలంలోని మాదారం ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటీడబ్ల్యూఓ)పై చర్యలు తీసుకోవాలని ఆర్‌వైఏ (RYA), ఏఐఎస్‌ఏ (AISA), కేవీపీఎస్ (KVPS) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఏడాది కాలంగా మాదారం ఆశ్రమ పాఠశాల అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. విద్యార్థులకు వంటలో నాణ్యతలేని పామ్ ఆయిల్ వినియోగిస్తున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం […]

ఆషాఢ మాస వేళ గారెపల్లిలో గోరింటాకు సంబురాలు

కాటారం,జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లి గ్రామంలోని అయ్యప్ప మహిళా గ్రూపు సభ్యులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం సామూహికంగా గోరింటాకు సంబురాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు గోరింటాకును సేకరించి ఒకరికి ఒకరు చేతులకు పెట్టుకుంటూ ఆటలు, పాటలు, నృత్యాలతో సందడి చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలు ఆషాఢ మాస విశిష్టతను చాటుతూ ఆనందోత్సాహాలతో వేడుకను జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం శుభప్రదమనే […]

భారీ వర్షానికి ఇళ్లు కూలి నిరాశ్రయమైన నిరుపేద కుటుంబం

కాటారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల మల్లయ్య ఇంటి గోడలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గోడలు కూలిపోవడంతో ఇంటిలో నివసించడం ప్రమాదకరంగా మారి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఘటనపై స్పందించిన ఎర్రగుంటపల్లి గ్రామ యువత, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని […]

పెగడపల్లిలో ఘనంగా శీతలా భవాని జాతర వేడుకలు

పెగడపల్లి,జూలై 28(ధనాధన్ న్యూస్): పెగడపల్లి గ్రామంలో బంజారా సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించే శీతలా భవాని పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. తండా పెద్ద పర్తి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, పాడి పశుసంపద సమృద్ధిగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని శీతలా భవాని అమ్మవారిని ప్రార్థించారు. తమ మొక్కుబడుల మేరకు మేకపోతులను సమర్పించి ప్రత్యేక […]

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు శాస్త్రవేత్త సూచనలు

కాటారం, జూలై 27(ధనాధన్ న్యూస్): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ కె. మదన్ మోహన్ రెడ్డి సూచించారు.కాటారం రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న మూడు రోజుల […]

వొడితల రాజేశ్వర్‌రావు సేవలు చిరస్మరణీయం: ప్రణవ్

హుజూరాబాద్, జూలై 24 (ధనాధన్ డిజిటల్ న్యూస్):మాజీ రాజ్యసభ సభ్యుడు వొడితల రాజేశ్వర్‌రావు దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన గొప్ప నాయకుడని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం వొడితల రాజేశ్వర్‌రావు వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుడా […]