డా.బి.ఆర్.అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రతి పౌరుడు తెలుసుకోవాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 14:జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మెట్రో ఉదయం జిల్లా స్టాఫ్ రిపోర్టర్, సీఎంపీ న్యూస్ ఛానల్ అధినేత మల్యాల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. […]
గండి రంజిత్ కుమార్ గౌడ్కు తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 13: ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ మీడియా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు గండి రంజిత్ కుమార్ గౌడ్కు ప్రతిష్టాత్మక తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం లభించింది.జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో వరంగల్లోని టీఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.దాదాపు […]
జగిత్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఐఎంఏ ముందడుగు

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 13: మాదకద్రవ్యాల వ్యసన నిర్మూలనకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించనున్న “యాంటీ డ్రగ్ 3కే రన్” కార్యక్రమ కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న మాదకద్రవ్యాల వ్యసనం దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా […]
బుగ్గారం పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీలు మాయం

బుగ్గారం/ధనాధన్ న్యూస్,జూన్ 13: జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీలు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీనియర్ జర్నలిస్టు చుక్క గంగారెడ్డి శనివారం బుగ్గారం ఎస్సై జి. సతీష్కు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2022 మే 1న బుగ్గారం పోలీస్ స్టేషన్ ఎదుట తనపై హత్యాయత్నం దాడి జరిగిందని తెలిపారు. ఆ ఘటనకు సంబంధించి అప్పటి ఎస్సై గుడికందుల సందీప్ కేసు నమోదు చేశారని […]
కనగర్తి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా “మన బడి – మన బాధ్యత” కార్యక్రమం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్,జూన్ 13: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “మన బడి – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ సీనియర్ నాయకుడు మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల […]
మోడీ స్వచ్ఛత పిలుపుతో కదిలిన బీజేపీ శ్రేణులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 13:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో (గర్ల్స్ హైస్కూల్) శనివారం బీజేపీ నాయకులు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారతం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు స్వయంగా శ్రమదానం చేసి పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు మొక్కల చుట్టూ పెరిగిన […]
మోచి బజార్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 12:జగిత్యాల పట్టణంలోని మోచి బజార్ ప్రాంతంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో ఘటన స్థలానికి చేరుకుని సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని కొంత సామగ్రి దగ్ధమైనట్లు తెలిసింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న జగిత్యాల […]
ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన యువతి.. ప్రేమ వ్యవహారమే కారణమా?

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 11: గండ్రపల్లి గ్రామానికి చెందిన గుంటి అయిలయ్య (60) తన కుమార్తె గుంటి మమత (30) అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న అయిలయ్యకు ఒక కుమారుడు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.చిన్న కుమార్తె మమత డిగ్రీ వరకు చదివి ఇంటి వద్దనే ఉంటోంది.పెళ్లి సంబంధాలు తీసుకొచ్చిన ప్రతిసారి మమత తనకు ఇష్టం లేదని తిరస్కరిస్తూ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విషయమై తండ్రి అయిలయ్య పలుమార్లు ప్రశ్నించగా,మంచిర్యాలకు చెందిన రవికుమార్ను ప్రేమిస్తున్నానని మమత తెలిపినట్లు పేర్కొన్నారు. […]
లేఅవుట్లో లేని సర్వే నంబర్.. కొనుగోలుదారుడి చిక్కులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 9:ప్లాట్ కొనుగోలు విషయంలో సర్వే నంబర్ నమోదు లోపంతో రుణం తిరస్కరణకు గురైన బాధితుడి ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డే దుర్గాప్రసాద్ (46), ప్రస్తుతం జమ్మికుంటలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో ఉన్న అంజనా టౌన్షిప్లో 59వ నంబర్ ప్లాట్ను కొనుగోలు చేశారు.ఈ ప్లాట్ను జొన్నతుల కోనారెడ్డి, రాఘవరెడ్డి, గర్రెపల్లి […]
మల్లాపూర్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 9: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం మల్లాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు రూ.89,10,324 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈ […]
