హుజురాబాద్‌లో బంద్ విజయవంతం – డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ప్రజల ఐక్యరూపం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన బంద్ విజయవంతంగా సాగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలపడంతో పట్టణం పూర్తిగా మూతపడింది.బంద్ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం … Read more

పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్:  తెలంగాణ అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న తాజా పరిణామాలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రసంగిస్తున్న సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా(ఎమ్ హెచ్ డి ) డిమాండ్ చేస్తోంది.నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేతో బి ఆర్ … Read more

దళితుల పట్ల కౌశిక్ రెడ్డికి వివక్ష తగ్గదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: దళితుల పట్ల కౌశిక్ రెడ్డి వివక్ష చూపెట్టడం తగదని,నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ ప్రస్థానంలో ఉన్న సీనియర్ నాయకుడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల శాసన సభ వేదికగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు అసభ్యకరమని,దీనిపై వెంటనే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి దళితులపై … Read more

నిరాధార వార్తలు రాస్తే..చట్టపరమైన చర్యలకు పిర్యాదు చేస్తాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని అంజనా టౌన్ షిప్ పై నిరాధార వార్తలు రాస్తున్న,ప్రచురిస్తున్న పత్రికా, ఛానెళ్ల పై చట్టపరమైన చర్యలకు పిర్యాదు చేశామని జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపెల్లి రాజేశ్వర్ రావు తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తక్కళ్ళపెల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ తనని రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కొందరు అధికార పార్టీ నాయకుల సహకారంతో జమ్మికుంట పట్టణానికి తలమానికంగా నిర్మాణం చేయబడ్డ … Read more

వీణవంక మండలంలో కాంగ్రెస్ ప్రచార జోరు!

వీణవంక/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూసుకుపోతోంది. శనివారం రోజున బేతిగల్, కనపర్తి, వల్భాపూర్, నర్సింగాపూర్, కిష్టం పేట, గంగారం, చల్లురు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, బాణాసంచా కాల్పులతో కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, గ్రామాల్లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను … Read more

ఇసుక మాఫియా దొంగలు మీరు

జమ్మికుంట/ధననాధన్ న్యూస్: కొబ్బరికాయల దొంగేవడు అంటే భుజాలు తడుముకున్నట్లు బీఆర్ఎస్ నాయకుల వ్యవహార తీరు ఉందని పత్తి కృష్ణా రెడ్డి తెలిపారు.ఆదివారం రోజున తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియాను మొదలు పెట్టిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్మాణ లోపంతో కుంగిపోయిన చెక్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే బాంబులతో కూల్చేశారని మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. జమ్మికుంట మండలం తనుగుల శంభుని పల్లి గ్రామం … Read more

ఇసుక మాఫియా చెలరేగిపోతోంది: హరీష్ రావు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వ అండదండలతోనే రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని, ముఖ్యంగా చెక్‌డ్యామ్‌లను కూల్చివేస్తూ టెర్రరిస్టులను మించిపోయే విధంగా అల్లర్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. రూ. 24 కోట్లతో నిర్మించిన తనుగుల చెక్‌డ్యామ్‌ను ఇసుక మాఫియా బాంబులతో పేల్చివేయడాన్ని ఆయన ఖండించారు.తనుగుల చెక్‌డ్యామ్‌ను శుక్రవారం సందర్శించిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, చెక్‌డ్యామ్‌ను పేల్చివేయడం వేలాది మంది రైతులపై జరిగిన ప్రత్యక్ష దాడి అని … Read more

గురుకులంలో బాలిక మృతి బాధాకరం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో హుజురాబాద్ మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని,దీనిపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారని, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు ఆయన రాంపూర్ గ్రామానికి వెళ్ళి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా బాలిక తల్లితండ్రులు … Read more

హుజురాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురుతుంది – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:హుజురాబాద్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచే ప్రతిపాదనను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుకు తెచ్చారని గుర్తుచేశారు. బీసీలకు న్యాయం చేసే విషయంలో తమ పార్టీ ఎప్పటికీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. … Read more

కౌశిక్ రెడ్డి దృష్టి చిల్లర రాజకీయాల మీద-మా దృష్టి అభివృద్ధి మీద

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కేసీఆర్,కేటీఆర్ మెప్పు పొందడానికే కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని,అభివృద్ధిని గాలికి వదిలేసి చిల్లర రాజకీయాల మీద దృష్టి పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అభివృద్ధి చేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం నాడు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి విద్య,వైద్య … Read more