సైదాపూర్,ధనాధన్ న్యూస్:
సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి కేశవేణి రాయమల్లు(89) అనారోగ్యంతో ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం రోజున పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతరం మణికంఠ మాడ్రన్ రైస్ మిల్ ఉడిగే విజయ రాజశేఖర్ 25కిలోల బియ్యం అందజేయడం జరిగిందని,గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పేసరు సంపత్,నీల కృష్ణ,అప్పాల మల్లేష్,కుందేళ్ళ సమ్మయ్య,పర్షవేణి విజయ్,టి శ్రీనివాస్,పొన్నం వెంకటయ్య,కేశవేణి బాలయ్య పాల్గొన్నారు.
