జమ్మికుంట అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జమ్మికుంట, ఆగస్టు 1(ధనాధన్ న్యూస్): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శనివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.యూనియన్ అధ్యక్షుడిగా అంబాల రజనీకాంత్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిన సభ్యులు మరోసారి ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించారు.నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా దొడ్డి రాజు, కోశాధికారిగా రాజేష్, ప్రచార కార్యదర్శిగా నన్నబోయిన రాజును ఎన్నుకున్నారు. యూనియన్ బలోపేతం కోసం కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక […]
నర్సింగాపూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బక్కచెటి చిన్న గంగాధర్ ఎన్నిక

జగిత్యాల రూరల్/ధనాధన్ న్యూస్,ఆగస్టు 1: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా బక్కచెటి చిన్న గంగాధర్, ఉపాధ్యక్షుడిగా సకినాల శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ధనాధన్ న్యూస్ రిపోర్టర్ రాజు రెడ్డి వారికి అభినందనలు తెలుపుతూ, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, […]
కరీంనగర్లో నూతన సిటీ బస్ సర్వీసుల ప్రారంభం

కరీంనగర్/ధనాధన్ న్యూస్: నగర ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో కరీంనగర్ నుంచి చింతకుంట, కొత్తపెళ్లి హవేలీ, వాగేశ్వరి కాలనీలకు నూతన సిటీ బస్ సర్వీసులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు మెరుగైన ప్రజా […]
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు

కాటారం,జూలై 30(ధనాధన్ న్యూస్): కాటారం మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే, ఈ వర్షాలతో వరి పొలాలు నీటితో నిండిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు క్రమంగా నిండుతుండటంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నిరంతర వర్షాల కారణంగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ […]
వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించిన దావ వసంత సురేష్

జగిత్యాల/ధనాధన్ న్యూస్ (జిల్లా ప్రతినిధి రాజా రెడ్డి): సారంగాపూర్ మండలం పెంబర్ల గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వప్న, పరమేశ్, దుర్గేష్ల నివాస గృహాలు కూలిపోయాయి. ఈ ఘటనపై జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి కూలిన ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆమె, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తక్షణమే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని […]
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల/ధనాధన్ న్యూస్ (జిల్లా ప్రతినిధి రాజా రెడ్డి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో గురువారం జూమ్ సమావేశం నిర్వహించి వర్షాల పరిస్థితిపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని […]
సమస్యల నిలయంగా మాదారం ఆశ్రమ పాఠశాల

మహాముత్తారం, జూలై 30(ధనాధన్ న్యూస్): మండలంలోని మాదారం ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటీడబ్ల్యూఓ)పై చర్యలు తీసుకోవాలని ఆర్వైఏ (RYA), ఏఐఎస్ఏ (AISA), కేవీపీఎస్ (KVPS) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఏడాది కాలంగా మాదారం ఆశ్రమ పాఠశాల అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. విద్యార్థులకు వంటలో నాణ్యతలేని పామ్ ఆయిల్ వినియోగిస్తున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం […]
వర్షాలకు కూలిన ఇంటిని పరిశీలించిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

జగిత్యాల/ధనాధన్ న్యూస్: సారంగపూర్ మండలంలోని పెంబట్ల, కోనపూర్ గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే సమయంలో పెంబట్ల గ్రామానికి చెందిన పాస్తం స్వప్న, ఆమె సోదరులు పరమేష్, దుర్గేష్ నివాస గృహం భారీ వర్షాల కారణంగా పూర్తిగా కూలిపోయింది.ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూలిన ఇంటిని పరిశీలించిన అనంతరం మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ), […]
అంగడిబజార్లో విషాదం.. విద్యుత్ షాక్తో ఆవు మృతి

జగిత్యాల/ధనాధన్ న్యూస్: జగిత్యాల పట్టణంలోని అంగడిబజార్లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్కు విద్యుత్ సరఫరా కొనసాగుతుండగా, సమీపంలోని చెట్ల ఆకులు తినేందుకు వచ్చిన ఓ ఆవు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడంతో మరింత ప్రమాదం తప్పింది. ఆవు స్థానంలో ఎవరైనా వ్యక్తి వెళ్లి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు […]
ఆషాఢ మాస వేళ గారెపల్లిలో గోరింటాకు సంబురాలు

కాటారం,జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లి గ్రామంలోని అయ్యప్ప మహిళా గ్రూపు సభ్యులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం సామూహికంగా గోరింటాకు సంబురాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు గోరింటాకును సేకరించి ఒకరికి ఒకరు చేతులకు పెట్టుకుంటూ ఆటలు, పాటలు, నృత్యాలతో సందడి చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలు ఆషాఢ మాస విశిష్టతను చాటుతూ ఆనందోత్సాహాలతో వేడుకను జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం శుభప్రదమనే […]
