పీఏసీఎస్‌లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

జయశంకర్ భూపాలపల్లి,జులై 2 (ధనాధన్ న్యూస్): కాటారం మండలంలోని గారేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా జరుగుతున్న యూరియా విక్రయాల ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ-పోస్ యంత్రాల ద్వారా జారీ చేస్తున్న బిల్లులు, రైతుల బుకింగ్ వివరాలు, స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వల […]

ఎస్ఐఆర్‌పై ప్రజలకు అవగాహన అవసరం

కాటారం,జులై 2 (ధనాధన్ న్యూస్): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన అవసరమని బీఆర్ఎస్ మండల నాయకుడు, ఇబ్రహీంపల్లి మొదటి వార్డు సభ్యుడు మంతెన చిరంజీవి అన్నారు.కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ఇంటింటి అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ పేర్లు, వ్యక్తిగత వివరాలను ఓటరు జాబితాలో […]

ప్రభుత్వ భూమిలో నిర్మాణం..అధికారుల మౌనం..!

కాటారం,జూన్ 30(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 257లో ప్రభుత్వ భూమిగా పేర్కొంటున్న స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా కొందరు వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ, ఫిర్యాదులు వచ్చినా స్పందించడం […]

విలేకరిని బెదిరించిన వారిపై కేసు నమోదు

భూపాలపల్లి,జూన్ 7 (ధనాధన్ న్యూస్):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన జర్నలిస్టు ఇప్పకాయల సాగర్‌ను దూషించి, ప్రాణహాని కలిగిస్తామని బెదిరించిన ఘటనలో రాయపల్లి గ్రామ సర్పంచ్ తాడం తిరుపతి, అంకం రాజేందర్‌లపై రేగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.వివరాల్లోకి వెళ్తే, రాయపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలింపుపై జర్నలిస్టు ఇప్పకాయల సాగర్ వార్త ప్రచురించారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తులు ఫోన్ ద్వారా దూషిస్తూ, చంపుతామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. […]

ఉపాధిహామీ కూలీలకి యోగ శిక్షణ

మహాముత్తారం(ధనాధన్ న్యూస్)మే22:మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో జాతీయ ఉపాధిహామీ కూలీలకి జాతీయ యోగ శిక్షణ అధ్యాపకుడు వావిల్ల కిష్టయ్య శిక్షణ ఇస్తూ యోగ వలన జరిగే ప్రయోజనాలను కూలీలకి వివరించడం జరిగింది.ప్రతిరోజూ ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వలన మనిషిని పట్టిపిడిస్తున్న  సైకో సోమటిక్ వ్యాధులు మానసిక వ్యాధులు భయం, కోపం,భద్రత భావము మొదలైన వ్యాధులను నయం చేయవచ్చునని,కరోన,గుండె సంబంధిత వ్యాధులు ధ్యానం తో నయం చేయవచ్చునని ఉపాధి హామీ కూలీలకి పని సామర్ధ్యమును పెంచడంతో పాటు […]