అఖండ హరినామ సంకీర్తనలో పాల్గొన్న రాములపల్లి భజన మండలి సభ్యులు

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే24:సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామానికి చెందిన భజన మండలి సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానంలో  24 గంటలు అఖండ హరినామ సంకీర్తనలతో జరిగే భజన కార్యక్రమం పాల్గొని దాదాపు 4 గంటలపాటు హరినామ సంకీర్తన భక్తి గీతాలతో హరినామ స్మరణలో పాల్గొన్నామని కందుల శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహాదేవుని సత్యనారాయణ, దొనకొండ సమ్మిరెడ్డి,ఇరుమల్ల జెపాల్ రెడ్డి,తిరుపతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి,నవీన్ రెడ్డి,సురేష్,సంపత్, రాము,నరేందర్ రెడ్డి,సురేందర్ రెడ్డి,రాములు, వెంకటనర్సు తదితరులు పాల్గొన్నారు.