ధనాధన్ న్యూస్ మే23:సైదాపూర్ మండల కేంద్రం నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సైదాపూర్ ఎస్సై తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం,గురువారం తెల్లవారు జామున ఎస్సై పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా వెంకటేశ్వర్లపల్లి గ్రామ శివారులో టీఎస్ 08 UB 3009 టాటా ఏసీ వాహనం వదిలి వెళ్ళగా వాహనాన్ని తనిఖీ చేయడంతో అందులో 26క్వింటాల రేషన్ బియ్యం ఉన్నాయని బండి నెంబర్ ఆధారంగా వల్లెపు అనిల్ అనే వ్యక్తి చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన పెద్ద బత్తుల కుమార్ అనే వ్యక్తి వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కు తరలిస్తున్నట్లు విచారణలో తేలినట్లు సైదాపూర్ ఎస్సై జన్ను ఆరోగ్యం తెలిపారు.కాగా ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.
- https://www.facebook.com/profile.php?id=61557327330992&mibextid=ZbWKwL
