కరీంనగర్‌లో పిడుగుపాటు..యువకుడికి తృటిలో తప్పిన ప్రమాదం.

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లాలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లో ఒక స్థానికుడు తన మొబైల్‌తో వర్షాన్ని రికార్డ్ చేస్తుండగా, సమీపంలో అకస్మాత్తుగా పిడుగు పడింది.ఈ సంఘటనతో అతడు తీవ్ర భయాందోళనకు గురై ఉలిక్కిపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.