- కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత.
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగలింది.పెద్దపెల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.బీఆర్ఎస్కు రాజీనామా చేసిన వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్వంలో ఇవాళ ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెంకటేష్ నేత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు.కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.కండువా కప్పి వెంకటేష్ నేతను కేసీ వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు.ఎంపీతో పాటు మరో బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
