జమ్మికుంట ఏప్రిల్ 05:జమ్మికుంట మండల పరిధిలోని పెద్దంపల్లి గ్రామంలో శ్రీ పోతరాజు సహిత శ్రీ పోచమ్మ ,నాగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది.పెద్దంపల్లి గ్రామంలో శుక్రవారం రోజు తెల్లవారుజామున వినాయక హోమం తో మొదలై ఆదివారం వనభోజనాలతో ఈ ప్రతిష్టాపన పూర్తవుతుందని అర్చకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండలం ఎంపీపీ దొడ్డే మమత,పెద్దంపల్లి సర్పంచ్ ఇల్లందుల అన్నపూర్ణ,వార్డ్ నెంబర్లు,గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
