సొంతగూటికి చేరిన ఏఐఎస్బి నాయకుడు

By dhanadhannews.com

పార్టీ కండువా కప్పుకున్న సాయి కిరణ్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)మే30:హుజరాబాద్ పట్టణానికి చెందిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర మాజీ కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్ గురువారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీలేని పోరాటాలతో ఉద్యమాలు నిర్మించి పార్టీలో విద్యార్థి విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించిన  ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ లో తిరిగి పని చేయడం ఆనందంగా ఉందని అన్నారు.రానున్న రోజుల్లో బలమైన ఉద్యమాలు నిర్మించి పార్టీ పటిష్టతకు తనపై నమ్మకం ఉంచి మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ పెద్దలకు సూర్య కిరణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.