అంగడిబజార్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఆవు మృతి

జగిత్యాల/ధనాధన్ న్యూస్: జగిత్యాల పట్టణంలోని అంగడిబజార్‌లో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్‌కు విద్యుత్ సరఫరా కొనసాగుతుండగా, సమీపంలోని చెట్ల ఆకులు తినేందుకు వచ్చిన ఓ ఆవు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడంతో మరింత ప్రమాదం తప్పింది. ఆవు స్థానంలో ఎవరైనా వ్యక్తి వెళ్లి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు […]

రాష్ట్ర,హుజూరాబాద్ ప్రజలు సుభిక్షంగా ఉండాలి: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, జూలై 29(ధనాధన్ న్యూస్): రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు ఎల్‌నినో ప్రభావంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ కొండగట్టు అంజన్నను ప్రార్థించారు.బుధవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండగట్టు గిరిప్రదక్షిణలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, […]

ఆషాఢ మాస వేళ గారెపల్లిలో గోరింటాకు సంబురాలు

కాటారం,జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లి గ్రామంలోని అయ్యప్ప మహిళా గ్రూపు సభ్యులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం సామూహికంగా గోరింటాకు సంబురాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు గోరింటాకును సేకరించి ఒకరికి ఒకరు చేతులకు పెట్టుకుంటూ ఆటలు, పాటలు, నృత్యాలతో సందడి చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలు ఆషాఢ మాస విశిష్టతను చాటుతూ ఆనందోత్సాహాలతో వేడుకను జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం శుభప్రదమనే […]

పెద్ద వాగులో ప్రమాదకరంగా పెరిగిన వరద ప్రవాహం

మహా ముత్తారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం నిమ్మగూడెం–పెగడపల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా నిమ్మగూడెం గ్రామపంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు.వాగు దాటే మార్గంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నీటి ప్రవాహం తగ్గే వరకు ఎవరూ వాగును దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు […]

భారీ వర్షానికి ఇళ్లు కూలి నిరాశ్రయమైన నిరుపేద కుటుంబం

కాటారం, జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల మల్లయ్య ఇంటి గోడలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గోడలు కూలిపోవడంతో ఇంటిలో నివసించడం ప్రమాదకరంగా మారి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ఈ ఘటనపై స్పందించిన ఎర్రగుంటపల్లి గ్రామ యువత, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అత్యవసర ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని […]

పెగడపల్లిలో ఘనంగా శీతలా భవాని జాతర వేడుకలు

పెగడపల్లి,జూలై 28(ధనాధన్ న్యూస్): పెగడపల్లి గ్రామంలో బంజారా సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించే శీతలా భవాని పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. తండా పెద్ద పర్తి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, పాడి పశుసంపద సమృద్ధిగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని శీతలా భవాని అమ్మవారిని ప్రార్థించారు. తమ మొక్కుబడుల మేరకు మేకపోతులను సమర్పించి ప్రత్యేక […]

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు శాస్త్రవేత్త సూచనలు

కాటారం, జూలై 27(ధనాధన్ న్యూస్): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ కె. మదన్ మోహన్ రెడ్డి సూచించారు.కాటారం రైతు వేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న మూడు రోజుల […]

జమ్మికుంటలో ఘనంగా అవొపా మెరిట్ అవార్డ్స్–2026

జమ్మికుంట, జూలై 26 (ధనాధన్ న్యూస్):జమ్మికుంట పట్టణంలో ఆర్యవైశ్య అవొపా జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ఆదివారం “అవొపా మెరిట్ అవార్డ్స్–2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ పెద్దలు, సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులను అవొపా సంఘం మెమెంటోలు, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించింది. సంఘ నాయకులు, అతిథులు వేదికపై విద్యార్థులకు అవార్డులు […]

వొడితల రాజేశ్వర్‌రావు సేవలు చిరస్మరణీయం: ప్రణవ్

హుజూరాబాద్, జూలై 24 (ధనాధన్ డిజిటల్ న్యూస్):మాజీ రాజ్యసభ సభ్యుడు వొడితల రాజేశ్వర్‌రావు దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన గొప్ప నాయకుడని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం వొడితల రాజేశ్వర్‌రావు వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుడా […]

కరీంనగర్ జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్, జూలై 23 (ధనాధన్ డిజిటల్ న్యూస్): కరీంనగర్ జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న హత్యలు, దోపిడీలు, చోరీలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, జిల్లా పోలీసు వ్యవస్థ శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కరీంనగర్ భగత్‌నగర్‌లో ఓ కుటుంబాన్ని ఆయుధాలతో బెదిరించి, తాళ్లతో బంధించి 72 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.21 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర […]