జగిత్యాల, ఆగస్టు 3 (ధనాధన్ న్యూస్): వైద్యం అంటే కేవలం చికిత్స మాత్రమే కాదు.. సేవ, మానవత్వం, ఆప్యాయత కూడా కలిసినప్పుడే అది సంపూర్ణమవుతుంది. ఈ మాటలను నిజం చేస్తూ జగిత్యాల పట్టణంలోని ఓం శ్రీ సాయి హాస్పిటల్ ప్రసూతి సేవల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చే ప్రతి తల్లికి, నవజాత శిశువుకు అవసరమైన వస్తువులతో కూడిన ఉచిత బేబీ కిట్‌ను అందజేస్తూ మాతృత్వానికి మధుర జ్ఞాపకాన్ని అందిస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన కేసీఆర్ కిట్ తరహాలోనే ఈ సేవను స్వచ్ఛందంగా కొనసాగిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.


ఆస్పత్రి వైద్యులు డాక్టర్ పనీంద్ర కుమార్, డాక్టర్ సాయి సుధా ఆధ్వర్యంలో తల్లీబిడ్డల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, వైద్య సేవలతో పాటు మానవీయ విలువలను ప్రతిబింబించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రసవం అనంతరం బిడ్డకు అవసరమైన సామగ్రిని ఉచితంగా అందించడం ద్వారా కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, ఆప్యాయతను పంచుతున్నారు.తాజాగా జనగామ శివానికి పండంటి ఆడబిడ్డ జన్మించగా, ఆస్పత్రి యాజమాన్యం తరఫున బేబీ కిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు వైద్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, “ఇది కేవలం ఒక కిట్ కాదు.. మా బిడ్డ జీవితంలో తొలి కానుక” అని ఆనందం వ్యక్తం చేశారు.లాభాపేక్ష కంటే సేవాభావానికి పెద్దపీట వేస్తూ, ప్రతి తల్లి చిరునవ్వును తమ విజయంగా భావిస్తున్న ఓం శ్రీ సాయి హాస్పిటల్ వైద్య బృందం అందిస్తున్న సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మాతృత్వాన్ని గౌరవిస్తూ, నవజాత శిశువుకు ప్రేమతో స్వాగతం పలికే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరి ప్రశంసలను అందుకుంటోంది.

Leave a Reply