యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నల్లబ్యాడ్జీల నిరసన

జగిత్యాల, జూలై 7(ధనాధన్ న్యూస్): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీజీపీఈజేఏసీ (TGPEJAC) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాలలోని టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) డివిజన్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో […]

కాటారం మండల కేంద్రంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

కాటారం,జూలై 7(ధనాధన్ న్యూస్): కాటారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మార్పీఎస్ కాటారం ఇంచార్జ్ బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి ఉద్యమ లక్ష్యాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ ఉద్యమం సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతూ నేటి తరానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల సంక్షేమంతో పాటు గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యసేవలు అందేలా ఉద్యమం చేసి […]

రూ.13 కోట్ల బీటీ రోడ్డు పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన

హనుమకొండ, జూలై 6 (ధనాధన్ న్యూస్):ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుంచి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) ఆధ్వర్యంలో రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

గౌన్లవానీకుంట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట,జూలై 3(ధనాధన్ న్యూస్): జమ్మికుంట నూతన తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గడ్డం సుధాకర్‌ను 5వ వార్డు కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 5వ వార్డులోని గౌన్లవానీకుంట ఆక్రమణలకు గురవుతోందని, వెంటనే రెవెన్యూ సర్వే నిర్వహించి కుంట హద్దులు నిర్ధారించి, చుట్టూ రక్షణ గోడ (బౌండరీ) ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని వార్డు ప్రజల తరఫున తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపై స్పందించిన తహసీల్దార్ […]

బాస్ స్కీమ్ విద్యార్థుల ప్రవేశాలపై వివాదం..చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల వినతి

జమ్మికుంట,జూలై 3(ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ హైస్కూల్‌లో బాస్ (BAS) స్కీమ్ కింద చదువుతున్న విద్యార్థులను పాఠశాలలో కొనసాగించకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు తల్లిదండ్రులు మండల విద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. తల్లిదండ్రుల కథనం ప్రకారం, ఈ విద్యా సంవత్సరంలో బాస్ స్కీమ్‌కు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి అందలేదని పేర్కొంటూ, విద్యార్థులను కొనసాగించాలంటే ఫీజులు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. ఫీజులు చెల్లించకపోతే తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్పించుకోవాలని సూచిస్తున్నారని […]

సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్!

హైదరాబాద్,జులై 03(ధనాధన్ న్యూస్):తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని నిరు ద్యోగులకు శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర సీడ్ & ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, రాష్ట్ర స్థాయి పోస్టు  ల భర్తీకి సరికొత్త జనరల్ రిక్రూట్‌ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థు లకు నెలకు రూ. 51,320 నుండి రూ. 1,27,310 వరకు వేతనం ఉంటుంది. […]

అప్పు చేసి కడుతున్న బ్రో..!

సిద్ధిపేట, జులై 3(ధనాధన్ న్యూస్): ఇల్లు కట్టడం అంటే ఇటుకలు, సిమెంట్‌తో పాటు అప్పులూ ఉంటాయనే విషయాన్ని ఓ వ్యక్తి వినూత్నంగా, హాస్యభరితంగా చెప్పేశాడు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తి, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఫొటోతో ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫ్లెక్సీలో బ్రహ్మానందం హావభావాలతో పాటు పెద్ద అక్షరాల్లో “అప్పు చేసి కడుతున్న బ్రో…” అని రాయించడంతో అటుగా వెళ్లేవారు ఆగి చదివి […]

పీఏసీఎస్‌లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

జయశంకర్ భూపాలపల్లి,జులై 2 (ధనాధన్ న్యూస్): కాటారం మండలంలోని గారేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా జరుగుతున్న యూరియా విక్రయాల ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ-పోస్ యంత్రాల ద్వారా జారీ చేస్తున్న బిల్లులు, రైతుల బుకింగ్ వివరాలు, స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వల […]

తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్, జులై 2 (ధనాధన్ న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వాగ్వాదం బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఇరు పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో గన్‌పార్క్ కేంద్రంగా రాజకీయ వేడి నెలకొంది.కాంగ్రెస్ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ గన్‌పార్క్‌కు చేరుకుని చర్చకు సిద్ధమయ్యారు. […]

ఎస్ఐఆర్‌పై ప్రజలకు అవగాహన అవసరం

కాటారం,జులై 2 (ధనాధన్ న్యూస్): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన అవసరమని బీఆర్ఎస్ మండల నాయకుడు, ఇబ్రహీంపల్లి మొదటి వార్డు సభ్యుడు మంతెన చిరంజీవి అన్నారు.కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ఇంటింటి అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ పేర్లు, వ్యక్తిగత వివరాలను ఓటరు జాబితాలో […]