జమ్మికుంటలో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, జూన్ 28: భారత మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆదివారం జమ్మికుంట పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు, విద్యా రంగం, విదేశాంగ విధానంలో ఆయన చేసిన కృషిని […]

అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 28: జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల నరేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బత్తుల నరేష్ మాట్లాడుతూ, అంబేద్కర్ పేరును కేవలం స్మరించుకోవడానికే పరిమితం కాకుండా ఆయన చూపిన మార్గాన్ని ఆచరణలో అమలు చేయాల్సిన […]

“గో టు విలేజ్ – మాదిగ పల్లెలకు తరలండి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

మల్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 27: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు చేపట్టిన 40 రోజుల కార్యాచరణలో భాగమైన “గో టు విలేజ్ – మాదిగ పల్లెలకు తరలండి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెస్పీ-ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మల్యాల మండల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం మాదిగ మాట్లాడుతూ, ఎస్సీల […]

ప్రజల పక్షాన పోరాడే సీపీఐని బలోపేతం చేద్దాం

కరీంనగర్/ధనాధన్ న్యూస్, జూన్ 27: ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ని బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై సంఘటితంగా ఉద్యమాలు నిర్వహించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.శనివారం గుంటూరుపల్లి గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ […]

చనిపోయిన కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

బుగ్గారం/ధనాధన్ న్యూస్, జూన్ 27(చుక్క గంగారెడ్డి,సీనియర్ జర్నలిస్ట్): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ఆత్మహత్య చేసుకున్న దళిత కౌలు రైతు మానాల పెద్ద దుబ్బయ్య (60) కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పరామర్శించారు.మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత […]

ఎమర్జెన్సీకి భయపడలేదు..జైలులోనూ ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 25: దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించినప్పటికీ తాము వెనుకడుగు వేయలేదని, జైలులో కూడా ఆర్ఎస్ఎస్ శాఖలను నిర్వహించామని ఆ సంఘం సీనియర్ కార్యకర్తలు తెలిపారు.జమ్మికుంటకు చెందిన మంతెన శ్రీమన్నారాయణ, హుజురాబాద్‌కు చెందిన కొమురవెల్లి సదానందం మాట్లాడుతూ, ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడామని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ, దేశ శాంతి భద్రతల కోసం కార్యకర్తలుగా పనిచేస్తూ ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొన్నామని, సుమారు మూడు నెలల పాటు […]

పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, వారికి రావాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులో విఫలమైందని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి విమర్శించారు.బుధవారం జమ్మికుంటలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు డీఏలను విడుదల చేస్తామని, పీఆర్‌సీని ప్రకటించి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ హామీలను అమలు చేయలేదని […]

డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇల్లందకుంట ఎస్సై కాంత్రికుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై కాంత్రికుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల సమాజంలో ఏర్పడే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత సరదాగా ప్రారంభించే ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా […]

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ సూచించారు.బుధవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ తదితర అవసరమైన పత్రాలను […]

“తవ్వారు..వదిలేశారు..! స్కూల్ పక్కనే ప్రమాదాలకు ఆహ్వానం”

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: కరీంనగర్ నగరంలోని 40వ డివిజన్ హనుమాన్‌నగర్‌లో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం రహదారి పక్కన గుంతలు తవ్వి, ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేయడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు విమర్శించారు. బ్లూబెల్స్ పాఠశాల సమీపంలోని సందు రహదారి వెంట డ్రైనేజీ పనులు చేపట్టి, ప్రజలకు హెచ్చరికలు లేకుండా వదిలేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, స్థానిక ప్రజలు […]