ప్రణాళికాబద్ధంగా చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గురువారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి, వారి తల్లిదండ్రులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. ఆకునూరు పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ … Read more

రెండో విడుత గొర్రెల పంపిణీ పథకం పునరుద్ధరించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: రాష్ట్రంలోని గొల్ల, కురుమల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచిన గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని మండల కురుమ సంఘం యూత్ అధ్యక్షుడు మునిపాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేయడంతో వేలాది కుటుంబాలు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేసినట్లు తెలిపారు. మొదటి విడతలో లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు అందించినప్పటికీ, రెండో విడత అమలు … Read more

బండి భగీరథ్ అరెస్టుకు టీజేఎస్ మహిళా విభాగం డిమాండ్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్ మే 16:మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) మహిళా విభాగం రాష్ట్ర మహిళా కమిషన్‌ను కోరింది. ఈ మేరకు టీజేఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరికిల్ల స్రవంతి, ముత్తు గీతాంజలి, మహిళా నాయకురాలు లావణ్య శనివారం మహిళా కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో వారు పేర్కొన్నదేమిటంటే… బాధిత మైనర్ … Read more

సిరిసేడు హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు ప్రభుత్వ హైస్కూల్‌లో ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ప్రైజ్ మనీ అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఫస్ట్ సాధించిన విద్యార్థికి రూ.5,000, స్కూల్ సెకండ్ వచ్చిన విద్యార్థికి రూ.3,000, స్కూల్ థర్డ్ స్థానం పొందిన విద్యార్థికి రూ.2,000 నగదు బహుమతులను అందించారు. విద్యార్థులు … Read more

ప్రవేట్ పాఠశాల వద్దు..గవర్నమెంట్ పాఠశాల ముద్దు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా “జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ చేపట్టారు.ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం బొట్ల రామస్వామి మాట్లాడుతూ, ప్రతి తల్లిదండ్రులు తమ బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు … Read more

అదనపు కట్నం కోసం వేధింపులు.. నలుగురిపై కేసు నమోదు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 10: అదనపు కట్నం తీసుకురావాలని కోడలిని వేధించిన భర్తతో పాటు అత్తమామలు, బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడిపల్లి గ్రామానికి చెందిన ఇగ్గేటి అనూష (26)కు గత ఏడాది ఉల్లంపల్లి గ్రామానికి చెందిన బుల్లి అజయ్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు కుటుంబ సభ్యులు ఎకరం భూమి, రూ.8 లక్షల నగదు, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించినట్లు తెలిపారు. పెళ్లి … Read more

తెలంగాణ జన సమితి పార్టీ 4వ ప్లీనరీ విజయవంతం చేయండి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ జన సమితి (TJS) పార్టీ 4వ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో ప్లీనరీకి సంబంధించిన వాల్ పోస్టర్‌ను టీజేఎస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షుడు పల్లెర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అరికిల్ల స్రవంతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో నిత్యం పోరాడుతున్న ఏకైక … Read more

కరీంనగర్ బంద్‌పై కాంగ్రెస్ ఫైర్.. బీజేపీ-బీఆర్ఎస్‌పై వొడితల ప్రణవ్ తీవ్ర విమర్శలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 9:బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు పాల్పడుతున్నాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆరోపించారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికా లేక రాజకీయ బలప్రదర్శనకా ఈ బంద్ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బయటకు పరస్పరం … Read more

కరీంనగర్‌లో శాంతిభద్రతలపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో పాటు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ కలిసి కలసి వినతిపత్రం సమర్పించారు.ఇటీవల కరీంనగర్ నగరంలో వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ షాపుల దొంగతనాలు, ప్రజలపై దాడులు, … Read more

పోస్ట్ ఆఫీస్ ఏరియాలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ఏరియాలో గల వాటర్ ట్యాంక్ సమీపంలో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఉదయం సుమారు 7 గంటల సమయంలో రోడ్డుపై దాదాపు 40 సంవత్సరాల వయస్సు గల ఓ వ్యక్తి మృతిచెంది పడి ఉన్నాడు. స్థానికుల వివరాల ప్రకారం, మృతుడు గత 15 రోజులుగా లేబర్ పని చేస్తూ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు తెలిసింది. బుధవారం … Read more