కోదండరాం పై కెసిఆర్ కుట్రలను సాగనివ్వం.

-తెలంగాణ జనసమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిళ్ల స్రవంతి. తెలంగాణ లో కెసిఆర్ అరాచక పాలన అంతం అయినకూడా తెలంగాణ ఉద్యమ రథ సారధి ప్రొఫెసర్ కోదండరాం పై కెసిఆర్ కుట్రలు మాత్రం ఆగడం లేదని తెలంగాణ జన సమితి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి ఆరోపించారు.ప్రొఫెసర్ కోదండరాం ని శాసన మండలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక … Read more

సర్పంచి కూతురు చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం.

సైదాపూర్, ధనా ధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రి ఉన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రారంభోత్సవాలు మేమే చేసుకుంటామంటే నడవదు.హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోటే ముందుకు వెళుతున్న గెలిచిన వెంటనే హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఫోన్ చేశానని అన్నారు.పొన్నం ప్రభాకర్ కు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన చరిత్ర ఉంది … Read more

రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్ళలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించా లని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం … Read more

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నేత మల్లికార్జున రాజేందర్

మంత్రి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.మంత్రి పొన్నం ప్రభాకర్,మాజీ యం.ఎల్.సి టి.సంతోష్ కుమార్ బిఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి పదవులతో పాటు కార్పొరేటర్ గా అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ గూటికి చేరడం సంతోషంగా ఉందని, … Read more

ఏపీలో తెలంగాణ మంత్రుల ప్రచారం?.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ రావొచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది. తెలంగాణలో గెలుపు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వంటివి పార్టీని ఏపీలో బలోపేతం చేస్తాయని కాంగ్రెస్‌ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నాయకుల సేవలను వాడుకోవాలని … Read more

రేపు తెలంగాణ జిల్లాలలో అమిత్ షా పర్యటన.

రేపు బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంట సమయంలో కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల ఆఫీస్ బేరర్స్ తో … Read more