
రాజన్న సిరిసిల్ల/ధనాధన్ న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన రైతు కొనుకటి లక్ష్మారెడ్డి పత్తి క్షేత్రానికి వచ్చిన రైతులతో నూజివీడు సీడ్స్ రీజినల్ సేల్స్ మేనేజర్ జె.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నవనీత్ పత్తి స్వల్ప కాలిక పంట,అన్ని రకాల నేలలకు అనుకూలమని,రసం పీల్చుపురులను తట్టుకుంటుందని,దగ్గర దగ్గర కాపు, పెద్దపెద్ద కాయలు,80 శాతం పత్తి మొదటి రెండు తీతలోనే వచ్చునని, పత్తి తీయటము సులువుగా ఉండడం వలన లేబర్ ఖర్చు తక్కువ అవుతుందని తద్వారా రైతుకు అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు, స్థానిక రైతు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన చేనులో ఒక్క చెట్టుకు 60 నుంచి 80 కాయలు ఉన్నాయని దాదాపు 12 నుంచి 15 క్వింటాల్ దిగుబడి వస్తుందని తెలిపారు, వచ్చే వాన కాలంలో రైతులు అధిక మొత్తంలో సాగు చేయవలసిందిగా కోరారు,ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు 220 మంది మరియు గ్రామ పెద్దలు, కంపెనీ ఏరియా మేనేజర్ నీల రాజు, మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గంగరాజు, మారుతి తదితరులు పాల్గొన్నారు.