జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే 09:బుధవారం బిజెపి బహిరంగ సభకు వేములవాడ కు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి హెలిప్యాడ్ వద్ద బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ స్వాగతం పలకడం జరిగింది.నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని,అంత గొప్ప నాయకున్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని,ఈ అవకాశం కల్పించిన బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి లకు మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు.
