ఆకునూరు పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్ కార్యక్రమం

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 13: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మండలంలోని ఆకునూరు ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, డ్రైనేజీలను శుభ్రపరిచి, చెత్తాచెదారం, కలుపు మొక్కలను తొలగించినట్లు పేర్కొన్నారు. … Read more

కనగర్తి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా “మన బడి – మన బాధ్యత” కార్యక్రమం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్,జూన్ 13: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “మన బడి – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ సీనియర్ నాయకుడు మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల … Read more

మోడీ స్వచ్ఛత పిలుపుతో కదిలిన బీజేపీ శ్రేణులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 13:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో (గర్ల్స్ హైస్కూల్) శనివారం బీజేపీ నాయకులు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారతం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు స్వయంగా శ్రమదానం చేసి పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు మొక్కల చుట్టూ పెరిగిన … Read more

గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం – కరీంనగర్‌లో వంటా-వార్పు

కరీంనగర్/ధనాధన్ న్యూస్ జూన్ 8: కేంద్రంలోని ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఎల్‌పీజీ గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలోని ఇందిరా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బీజేపీ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి … Read more

బండి భగీరథ్ అరెస్టుకు టీజేఎస్ మహిళా విభాగం డిమాండ్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్ మే 16:మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) మహిళా విభాగం రాష్ట్ర మహిళా కమిషన్‌ను కోరింది. ఈ మేరకు టీజేఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరికిల్ల స్రవంతి, ముత్తు గీతాంజలి, మహిళా నాయకురాలు లావణ్య శనివారం మహిళా కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో వారు పేర్కొన్నదేమిటంటే… బాధిత మైనర్ … Read more

జమ్మికుంట బీజేపీ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పుల్లూరి ప్రశాంత్ నియామకం

జమ్మికుంట/ధనధాన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పుల్లూరి ప్రశాంత్‌ను నియమించారు. ఈ నియామకం పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ మాట్లాడుతూ, వార్డ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేసిన తనను పట్టణ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుడు కృష్ణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, … Read more

ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా దొంతరవేన రమేష్ యాదవ్

జమ్మికుంట,ధనాధన్ న్యూస్:జమ్మికుంట మండల ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా మాచనపల్లి గ్రామ ఉపసర్పంచ్ దొంతరవేన రమేష్ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో మండలంలోని 15 మంది ఉపసర్పంచ్‌లు రమేష్ యాదవ్‌కు మద్దతు తెలపడంతో ఆయనను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన సహచర ఉపసర్పంచ్‌లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో గ్రామాల సమగ్ర అభివృద్ధికి, ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరియు … Read more

సొంత గూటికి మద్దుల ప్రశాంత్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్ సొంత గూటికి చేరారు. బుధవారం హుజురాబాద్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా మద్దుల ప్రశాంత్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ కండువా కప్పి ఘనంగా పార్టీలోకి స్వాగతం పలికారు.గతంలో బీజేపీలో … Read more

మన వార్త దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరణ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జనవరి 07 :మన వార్త దినపత్రిక నూతన సంవత్సరం 2026 క్యాలండర్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జమ్మికుంటలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ,పత్రిక ప్రజలకు–అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. సమాజానికి అవసరమైన వార్తలు, సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చేరవేస్తూ, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అనతికాలంలోనే విశేష ప్రాచుర్యం పొందిన మన వార్త దినపత్రిక యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు.ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో … Read more

కబ్జాకు గురైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని కాపాడాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విలువైన భూమిని కొంతమంది అక్రమంగా కబ్జా చేశారని, ఆ స్థలాన్ని తిరిగి కళాశాల పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీపీడీసీ సభ్యుడు టంగుటూరి రాజకుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.బుధవారం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంత్రి బండి సంజయ్‌ను కలిసిన రాజకుమార్, కళాశాల భూకబ్జా అంశంపై గత 23 … Read more