శంకరపట్నం/ధనాధన్ న్యూస్: శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో గల రాజరాజేశ్వర పారా బాయిల్డ్ రైస్ మిల్లులో శనివారం ఎన్ఫోర్స్మెంట్ స్టేట్ కమిటీ తనిఖీలను నిర్వహించింది. ఈ తనిఖీలను స్టేట్ కమిటీ మెంబర్ లక్మా రెడ్డి ఆధ్వర్యంలో చేశారు.2022-23 రబీ సీజన్ కు సంబంధించి సేకరించిన ధాన్యం ప్రభుత్వానికి ఇచ్చిన ధాన్యం సరిచూడగా ఆ పారా బాయిల్డ్ రైస్ మిల్లులో మూడు లక్షల ఇరవై వేల ధాన్యం బస్తాలు ఉండాల్సి ఉండగా 1670 ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నాయని గుర్తించారు.దాదాపు 670 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికిగాను 14 లక్షల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు.ఈ తనిఖీలలో బిఎం హాతిరాం,సివిల్ సప్లై డిటి వేణుగోపాల్,ఏఎస్ఐ సుధాకర్,కేశవపట్నం డిప్యూటీ తాసిల్దార్ బండి రమేష్,ఏం అసిస్టెంట్ సీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
