నర్సింగాపూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బక్కచెటి చిన్న గంగాధర్ ఎన్నిక

జగిత్యాల రూరల్/ధనాధన్ న్యూస్,ఆగస్టు 1: జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో శనివారం మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా బక్కచెటి చిన్న గంగాధర్, ఉపాధ్యక్షుడిగా సకినాల శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ధనాధన్ న్యూస్ రిపోర్టర్ రాజు రెడ్డి వారికి అభినందనలు తెలుపుతూ, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, […]

కరీంనగర్‌లో నూతన సిటీ బస్ సర్వీసుల ప్రారంభం

కరీంనగర్/ధనాధన్ న్యూస్: నగర ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో కరీంనగర్ నుంచి చింతకుంట, కొత్తపెళ్లి హవేలీ, వాగేశ్వరి కాలనీలకు నూతన సిటీ బస్ సర్వీసులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు మెరుగైన ప్రజా […]

వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించిన దావ వసంత సురేష్

జగిత్యాల/ధనాధన్ న్యూస్ (జిల్లా ప్రతినిధి రాజా రెడ్డి): సారంగాపూర్ మండలం పెంబర్ల గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్వప్న, పరమేశ్, దుర్గేష్‌ల నివాస గృహాలు కూలిపోయాయి. ఈ ఘటనపై జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి కూలిన ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆమె, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తక్షణమే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని […]

రాష్ట్ర,హుజూరాబాద్ ప్రజలు సుభిక్షంగా ఉండాలి: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, జూలై 29(ధనాధన్ న్యూస్): రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు ఎల్‌నినో ప్రభావంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ కొండగట్టు అంజన్నను ప్రార్థించారు.బుధవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండగట్టు గిరిప్రదక్షిణలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, […]

వొడితల రాజేశ్వర్‌రావు సేవలు చిరస్మరణీయం: ప్రణవ్

హుజూరాబాద్, జూలై 24 (ధనాధన్ డిజిటల్ న్యూస్):మాజీ రాజ్యసభ సభ్యుడు వొడితల రాజేశ్వర్‌రావు దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిన గొప్ప నాయకుడని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం వొడితల రాజేశ్వర్‌రావు వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుడా […]

కరీంనగర్ జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్, జూలై 23 (ధనాధన్ డిజిటల్ న్యూస్): కరీంనగర్ జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న హత్యలు, దోపిడీలు, చోరీలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, జిల్లా పోలీసు వ్యవస్థ శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కరీంనగర్ భగత్‌నగర్‌లో ఓ కుటుంబాన్ని ఆయుధాలతో బెదిరించి, తాళ్లతో బంధించి 72 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.21 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర […]

బీసీ బిడ్డ ఈశ్వరమ్మ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలకు శివచరణ్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి: దొంతరవేన రమేష్ యాదవ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమితులైన బీసీ మహిళ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌పై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉప సర్పంచ్‌ల ఫోరం జమ్మికుంట మండల అధ్యక్షుడు దొంతరవేన రమేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ మహిళను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. జక్కిడి శివచరణ్ రెడ్డి వెంటనే పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు, యాదవ జాతికి, […]

హుజురాబాద్ లో సుందరం హోమ్ ఫైనాన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్:సుందరం ఫైనాన్స్ లిమిటెడ్, వారి అనుబంధ సంస్థ సుందరం హోమ్ ఫైనాన్స్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నూతన బ్రాంచ్ ను సుందరం హోం ఫైనాన్స్ ఈబీ బిజినెస్ హెడ్ సురేష్ బాబు, రీజినల్ హెడ్  మల్లేష్ లు క్లస్టర్ హెడ్స్ అమ్మిరెడ్డి, నాగ రవిప్రసాద్, యాకయ్యలతో కలిసి ప్రారంభించారు. సంస్థ ఉద్యోగులు, కార్పొరేట్ చానల్ పార్టనర్లు మరియు ఇతర బిజినెస్ పార్టనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందరం హోం ఫైనాన్స్ […]

గురువు ఆశీస్సులతో ప్రజాసేవ బాటలోకి అరికిల్ల స్రవంతి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం శిష్యురాలు అరికిల్ల స్రవంతి తన రాజకీయ ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు.జమ్మికుంట మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన రాజకీయ గురువు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ,జనసమితి పార్టీ ఆవిర్భావం నుంచే స్రవంతి పార్టీకి వెన్నెముకలా నిలిచిందని అన్నారు.కార్యకర్త స్థాయి నుంచి ప్రారంభమైన […]

మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజుల వినోద్ ఆధ్వర్యంలో పలువురికి సన్మానం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని  సర్వాయిపేట మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజుల వినోద్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగని పురస్కరించుకుని నూతనంగా సైదాపూర్ ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన స్వాతి నీ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు .అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్  దొంత సుధాకర్ ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.అనంతరం  బిఆర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మాల సంక్షేమం […]