మృగశిర కార్తిలో చేపల కోసం నిరీక్షణ.. నిరాశతో వెనుదిరిగిన ప్రజలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 8: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో మృగశిర కార్తి సందర్భంగా సోమవారం గ్రామ చెరువులో చేపల వేట నిర్వహించారు. చేపలు లభిస్తాయనే ఆశతో ఆకునూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు చెరువు వద్దకు తరలివచ్చారు. అయితే ఆశించిన మేర చేపలు దొరకకపోవడంతో దాదాపు 500 మందికి పైగా ప్రజలు నిరాశతో, ఆగ్రహంతో వెనుదిరిగారు.ప్రజలు మాట్లాడుతూ ఉదయం నుంచే చెరువు వద్ద వేచి ఉన్నప్పటికీ సాయంత్రం నాలుగు గంటల … Read more

గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం – కరీంనగర్‌లో వంటా-వార్పు

కరీంనగర్/ధనాధన్ న్యూస్ జూన్ 8: కేంద్రంలోని ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఎల్‌పీజీ గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలోని ఇందిరా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బీజేపీ వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కట్టెల పొయ్యిపై వంట చేస్తూ కాంగ్రెస్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి … Read more

మృగశిర కార్తె సందర్భంగా ఉచిత ఆయుర్వేద మందు పంపిణీ

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో ఉన్న శ్రీ సూర్య భగవాన్ ధన్వంతరి ఆలయంలో మృగశిర కార్తె సందర్భంగా భక్తులకు మృగశిర ఆయుర్వేద ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మృగశిర కార్తె రోజున ఈ ఔషధాన్ని సేవించడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఈసినోఫిలియా తదితర అలర్జీ సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. … Read more

అంతర్గాంలో మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవ ప్రారంభం

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో సర్పంచ్ కంటెస్టెడ్ అభ్యర్థి కోల భవాని-అరుణ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళల కోసం ఉచిత ఆటో ప్రయాణ సేవను సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవను ప్రారంభించి మాట్లాడారు. మహిళల సంక్షేమం, సౌకర్యాల కల్పనకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మహిళల … Read more

తెలంగాణ ఉద్యమకారుడు పులిగారి చంద్రశేఖర్ రెడ్డికి ఘన నివాళి

వికారాబాద్/ధనాధన్ న్యూస్ జూన్ 8: తెలంగాణ ఉద్యమకారుడు, వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ దివంగత పులిగారి చంద్రశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా సోమవారం వికాస్ జూనియర్ కళాశాల ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి తెలంగాణ ఉద్యమకారులు, కళాశాల సిబ్బంది, మున్నూరు సోమారం గ్రామ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పులిగారి చంద్రశేఖర్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజ సేవతో పాటు విద్యా రంగ … Read more

జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టుల ప్రతినిధులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజానికి సమాచారాన్ని అందిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయితే తక్కువ ఆదాయంతో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు తమ పిల్లల విద్యా ఖర్చులను భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. … Read more

విలేకరిని బెదిరించిన వారిపై కేసు నమోదు

భూపాలపల్లి,జూన్ 7 (ధనాధన్ న్యూస్):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన జర్నలిస్టు ఇప్పకాయల సాగర్‌ను దూషించి, ప్రాణహాని కలిగిస్తామని బెదిరించిన ఘటనలో రాయపల్లి గ్రామ సర్పంచ్ తాడం తిరుపతి, అంకం రాజేందర్‌లపై రేగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.వివరాల్లోకి వెళ్తే, రాయపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలింపుపై జర్నలిస్టు ఇప్పకాయల సాగర్ వార్త ప్రచురించారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తులు ఫోన్ ద్వారా దూషిస్తూ, చంపుతామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. … Read more

దివంగత మిత్రుని కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 7: స్నేహం అంటే కేవలం కలిసి చదవడం, కలుసుకోవడం మాత్రమే కాదని, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలవడమేనని హుస్నాబాద్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు.సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన బొడిగ తిరుపతి గత నెల 24న అనారోగ్యంతో అకాల మరణం చెందగా,ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు తోటి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు.1996–2016 మధ్య హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో తిరుపతితో కలిసి చదువుకున్న స్నేహితులు నిజాం కళాశాల ప్రొఫెసర్ వేల్పుల … Read more

ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

వికారాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 06: వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లి 10వ వార్డులో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వార్డు సభల ద్వారా స్థానిక సమస్యలను గుర్తించడం, అభివృద్ధి పనులను సూచించడం, సమగ్ర వార్డు అభివృద్ధి ప్రణాళిక రూపొందించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం … Read more

తెలంగాణ భూములను దోచుకునే కుట్ర జరుగుతోంది: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 06: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో భారీ స్థాయిలో భూదందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శనివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను బడాబాబులకు అప్పగించే కుట్ర చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించిన ఆధారాలను దశలవారీగా ప్రజల ముందుకు తీసుకువస్తానని తెలిపారు. తెలంగాణ భూములు, … Read more