- ఎల్ఐసి తోడు నీడ కాంపిటీషన్ విజేతల ఆత్మీయ సమ్మేళనం
అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి ఎల్ఐసి (జీవిత బీమా సంస్థ) ఆధ్వర్యంలో రూ 50 వేల విలువగల బ్లూ స్టార్ కూల్ వాటర్ డిస్పెన్సర్ ను విరాళంగా బహుకరించారు. అదేవిధంగా
శనివారం ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ మండపంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజనల్ ఆఫీసు వారు తోడు నీడ అనే కాంపిటీషన్ నిర్వహించి విజేతలకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుండి 400 మంది ఏజెంట్లు పాల్గొన్నారు.సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎస్వి ప్రసాదరావు ,మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్,కె శ్రీనివాస్ మేనేజర్ సేల్స్,రాజేష్ కన్నా,హుజురాబాద్ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ శ్రీధర్,జమ్మికుంట బ్రాంచ్ మేనేజర్ విక్టర్ ఇమ్మానుయేల్,హుజురాబాద్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ బి.సమ్మయ్య,లియాఫీ నాయకులు పంజాల ప్రభాకర్ ,చందుపట్ల నరసింహారెడ్డి, బాలసాని రవీందర్,ముకిరాల సంపత్ రావు,కొండా తిరుపతి,ఆదిలాబాద్ నిర్మల్ కరీంనగర్ జిల్లాల నుండి 400 ఏజెంట్ మిత్రులు అర్హత సాధించిన వారికి సన్మానం,వేద ఆశీర్వచనము కార్యక్రమము నిర్వహించారు.
