జాతీయజెండాను అవమాన పరిచిన పంచాయతీ కార్యదర్శి

  • కార్యదర్శి ని సస్పెండ్ చేయాలంటున్న సోమారం గ్రామ ప్రజలు

సైదాపూర్ మండలంలోని సోమవారం గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించే క్రమంలో జెండా ఊడి నేలపై పడింది.గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం ద్వారానే జాతీయ జెండా ఆవిష్కరించే క్రమంలో నేలపై పడ్డది అని జాతీయ జెండా అవమాన పరిచిన పంచాయతీ కార్యదర్శి ఊసకోయిల రాజీవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ ని కోరారు.పంచాయతీ కార్యదర్శి రాజీవ్ మండలంలోని సీనియర్ నాయకుడి కి కుటుంబ సభ్యుడు కావడం వల్ల,ఏం జరిగినా ఆయన చూసుకుంటాడనే ధోరణి తో తన ఇష్టం వచ్చినట్లు వ్యవహారిస్తున్నాడని గ్రామ ప్రజలు ఆరోపించారు.