సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి

By dhanadhannews.com

సైదాపూర్ మండలం దుదేనపల్లి గ్రామంలోని  పెద్దమ్మ తల్లి దేవస్థానంలోని గుడి చుట్టూ సిసి రోడ్ పనులను బుధవారం రోజున ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి గుండారపు శ్రీనివాస్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దుదేదనపల్లి గ్రామ ఎంపీటీసీ చాడ చైతన్య మరియు గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి చిన్న వెంకటేశం,కాంగ్రెస్ కార్యకర్తలు,ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముదిరాజ్ కులస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.