జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే09:జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో ఉపాధి పని కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పుప్పాల రఘు,ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ ప్రతి ఉపాధి హామీ కార్మికులను పలకరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రామీణ స్థాయిలో ఉపాధి హామీ పథకం కల్పిస్తూ,ప్రతి ఇంటికి రేషన్ బియ్యం అందిస్తూ,స్మశాన వాటికలు,ఉజ్వల గ్యాస్ యోజన,అనేక రకాల పథకాలు అందిస్తున్నారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పోలింగ్ బూత్ అధ్యక్షులు సుంకరి శ్రీనివాస్,రాచపల్లి రాజయ్య,నాయకులుమాజీ సర్పంచ్ వ్యామ రవీందర్,పంజాల రవీందర్,దార శ్రావణ్,యమ సంతోష్,పొలసాని శ్రీనివాసరావు,రవీందర్రావు,రాజపల్లి స్వామి,రవీందర్ తదితరులు పాల్గొని మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
