కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నేత మల్లికార్జున రాజేందర్

మంత్రి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.మంత్రి పొన్నం ప్రభాకర్,మాజీ యం.ఎల్.సి టి.సంతోష్ కుమార్ బిఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.గతంలో కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి పదవులతో పాటు కార్పొరేటర్ గా అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ గూటికి చేరడం సంతోషంగా ఉందని, … Read more

ఏపీలో తెలంగాణ మంత్రుల ప్రచారం?.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ రావొచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది. తెలంగాణలో గెలుపు, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వంటివి పార్టీని ఏపీలో బలోపేతం చేస్తాయని కాంగ్రెస్‌ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నాయకుల సేవలను వాడుకోవాలని … Read more

రేపు తెలంగాణ జిల్లాలలో అమిత్ షా పర్యటన.

రేపు బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంట సమయంలో కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల ఆఫీస్ బేరర్స్ తో … Read more

దళిత బంధు రెండవ విడత కోసం లబ్ధిదారుల ఎదురుచూపు.

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు ఆబాది జమ్మికుంటలో దళిత బంధు లబ్ధిదారులు రెండో విడత నిధులను ఎలాగైనా మంజూరు చేసి మా దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు భోగం వెంకటేష్ మాట్లాడుతూ దళితబందు మొదటి విడత వచ్చి … Read more

విడాకులు నన్ను ఎంతో బాధించాయి.

వివాహం జరిగిన మూడేళ్లలోనే విడాకులు తీసుకోవడంపై నటి నిహారిక స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. విడాకులకు ముందు, తర్వాత ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడారు.అది తనకెంతో క్లిష్టమైన దశ అన్నారు. బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు.మాది ప్రేమ వివాహం కాదు.వివాహం,ఆ వెంటనే విడిపోవడం ఎంతో క్లిష్టంగా ఉంటుంది.పెళ్లి అనేది చిన్న విషయం కాదు, జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఎవరైనా వివాహం చేసుకుంటారు.నేనూ అదే ఆశతో అడుగులు వేశా అనుకున్నవిధంగా పరిస్థితుల్లేవు.సులభంగా మనుషులను నమ్మకూడదనే … Read more

పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన గంజాయి స్మగ్లర్లు.

మహబూబాబాద్‌లో శుక్రవారం విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.ఆంధ్ర ఒరిస్సా సరిహద్డులో గంజాయి ప్యాక్ చేసుకున్న స్మగ్లర్లు కారులో హైదరాబాద్ కు తరలిస్తున్నారు.హైవే మీదుగా వెళ్తే పోలీసులు పట్టుకుంటారని అడ్డదారిలో వెళ్తున్న ఈ క్రమంలోనే వాళ్ల రూట్ మ్యాప్ లో ఊహించని ట్విస్ట్ ఎదురయింది.. నెల్లికుదురు సమీపంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు.ఆ మార్గంలో వెళుతున్న స్మగ్లర్లు.ఎక్సైజ్ సిబ్బందిని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ల ప్రయత్నం బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోయారు. కారు … Read more

లారీ డ్రైవర్స్ క్లీనర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

జమ్మికుంట పట్టణ లారీ డ్రైవర్స్ క్లినర్స్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా త్రివర్ణ పతకాన్ని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పొనగంటి మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పొనగంటి మల్లయ్య మాట్లాడుతూ లారీ డ్రైవర్లకు క్లీనర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ముద్రవేణి రవి ఉపాధ్యక్షులు గాజ శంకర్ప్ర,ధానకార్యదర్శి మారపల్లి సుమన్,కోశాధికారి సొల్లేటి రఘు,కార్యదర్శి కంకటి రవి, సలహాదారులు రాచపల్లి … Read more

బెస్ట్ ఎంప్లాయ్ గా అసిస్టెంట్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్.

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్ ను బెస్ట్ ఎంప్లాయ్ గా విద్యుత్ శాఖ సూపర్డెంట్ గంగాధర్ ఎంపిక చేశారు.ఈ యొక్క అవార్డు జమ్మికుంట టౌన్ ఏ ఈ సురేశ్వర చారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ మారేపల్లి సంజీవరావు,సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సంపత్, లైన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి,లైన్మెన్ ఐలేష్ ,కనకయ్య,సుదర్శన్ అసిస్టెంట్ లైన్మెన్ మహేందర్ రెడ్డి,సంపత్, శ్రీనివాస్,రాధాకృష్ణ జూనియర్ … Read more

టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Republic day

జమ్మికుంట పట్టణ కేంద్రంలోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయంలో హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు సౌడమల్ల యోహన్, అయిత రాధాకృష్ణ ఆధ్వర్యంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు… ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి, యూనియన్ సభ్యులకు,నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులకు ,ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు విద్యార్థులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు సౌడమల్ల యోహన్, అయిత రాధాకృష్ణ … Read more

ఆడ్తిదారుల సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానo

జమ్మికుంట జనవరి 24: అడ్తీదారుల, ఖరీదు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అడ్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు అన్నారు.జమ్మికుంట అడ్తిదారుల సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం జమ్మికుంట ఆడ్తిదారులు ఖరీదు వ్యాపారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆడ్తిదారుల సంఘం అధ్యక్షులుగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అడ్తీదారుల సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావుని గౌరవ అధ్యక్షుడు పాకాల రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గౌడ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గుత్తి కుమారస్వామి … Read more