- పాఠశాల విద్యార్థులకు,సురక్షితమైన త్రాగు నీటి కోసం వాటర్ ప్యూర్ఫైయర్ బహుకరణ
- ప్రత్యేక నిధుల ద్వారా అదనపు తరగతుల నిర్మాణాలు
- హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వోడితల ప్రణవ్
చదువుకు పేదరికం అడ్డు కాదని,చదువుకోవడానికి ముందుకు వస్తే సహకరించడానికి మేము ఉన్నామని, కలుషితం లేని మంచినీరు తాగడం కోసం పాఠశాలకు వాటర్ ప్యూరిఫైడ్ నీళ్లను త్వరలోనే అందజేస్తామని కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.హుజురాబాద్లోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షప్యాడ్లు,స్టేషనరీని అందజేశారు.
