జాతీయ రోడ్డు భద్రత మనందరి బాధ్యత: సర్పంచ్ గుర్రాల స్వతంత్ర

సైదాపూర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 13:సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి అవసరమైన పత్రాలను … Read more

వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షిక సాంస్కృతికోత్సవాలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలోని వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో వార్షిక సాంస్కృతికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం విద్యార్థుల కళా ప్రదర్శనలతో కళకళలాడింది. విద్యార్థులు నృత్యాలు, సంగీతం, నాటికలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో భాగంగా అతిథుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ప్రముఖులు, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంతో పాటు వారి ప్రతిభ, … Read more

ప్రజల సమస్యల పరిష్కారానికి “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” గ్రామసభ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్:పెద్దంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ అధ్యక్షతన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” గ్రామసభను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారాలు చూపించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.ఈ సందర్భంగా సర్పంచ్ ఎగిత పద్మ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, … Read more

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వెంకటేశ్వర్లపల్లిలో గ్రామ సభ

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ రాయిచెట్టి చంద్రయ్య ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాయిచెట్టి చంద్రయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామానికి తాజాగా 27 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే వితంతు, వికలాంగులు, వృద్ధాప్య పింఛన్లు అర్హులందరికీ అందేలా … Read more

డంపింగ్ యార్డు స్థల మార్పిడికి కట్టుబడి ఉన్నాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన డంపింగ్ యార్డు స్థలాన్ని మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో రీల్స్, లైకులు పొందడానికే పరిమితమై, ప్రజా సమస్యల … Read more

హుజూరాబాద్‌లో మున్సిపల్ కార్మికుల నిరసన – లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఆందోళన

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్‌లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అటెండెన్స్ పాయింట్ వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే 2021 సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. … Read more

హుజూరాబాద్‌కు మరిన్ని బస్ సర్వీసులు – మంత్రిని కలిసిన ప్రణవ్

హైదరాబాద్/ధనా ధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు కొత్త బస్ సర్వీసులను మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రిని కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. నియోజకవర్గంలోని బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి … Read more

పాడి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా డిమాండ్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్:  తెలంగాణ అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న తాజా పరిణామాలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రసంగిస్తున్న సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలని మాదిగ హక్కుల దండోరా(ఎమ్ హెచ్ డి ) డిమాండ్ చేస్తోంది.నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేతో బి ఆర్ … Read more

ఆధ్యాత్మిక సేవలకు గౌరవం..డా.నాగుల సత్యం గౌడ్‌కు జాతీయ పురస్కారం

ప్రజాకవి, తత్వవేత్త, ఆధ్యాత్మిక విశ్వ గురువు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్‌కు జాతీయ స్థాయి “ఆధ్యాత్మిక విజ్ఞాన జ్యోతి” పురస్కారం అందజేశారు.ఈ కార్యక్రమం కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో ఘనంగా నిర్వహించారు.సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవ, రచనా రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేశారు.మానవ విలువల పరిరక్షణలో ఆయన చేస్తున్న సేవలు విశేషంగా నిలిచాయి.తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, శ్రీ విరాట్ విశ్వకర్మ … Read more

దళితుల పట్ల కౌశిక్ రెడ్డికి వివక్ష తగ్గదు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: దళితుల పట్ల కౌశిక్ రెడ్డి వివక్ష చూపెట్టడం తగదని,నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ ప్రస్థానంలో ఉన్న సీనియర్ నాయకుడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల శాసన సభ వేదికగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు అసభ్యకరమని,దీనిపై వెంటనే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి దళితులపై … Read more