జగిత్యాల బాలిక శ్వేష్ట రెడ్డి అరుదైన ఘనత

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17:జగిత్యాల పట్టణానికి చెందిన లంకన్నగారి శ్వేష్ట రెడ్డి అనే రెండేళ్ల 11 నెలల 22 రోజుల చిన్నారి అరుదైన ఘనత సాధించింది. అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది.భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానులను కేవలం ఒక నిమిషంలో గుర్తించి అత్యంత వేగంగా చెప్పిన టాడ్లర్గా శ్వేష్ట రెడ్డి రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతను ఆమె 2026 జూన్ 8న సాధించగా, ఇండియా బుక్ […]
శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 17: జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహించిన శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. […]
కేంద్రీయ విద్యాలయంపై రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై ఎంపీ ధర్మపురి అరవింద్ అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలకు స్పందిస్తూ, కేంద్రీయ విద్యాలయానికి అవసరమైన 5 ఎకరాల స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భూమి సర్వే నిర్వహించి, సంబంధిత పత్రాలను సుమారు పది రోజుల క్రితమే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్కు […]
ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు:డాక్టర్ భోగ శ్రావణి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17: జగిత్యాల అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని, కేంద్ర విద్యాలయానికి స్థలం కేటాయింపును అడ్డుకుంటున్నది ఎవరో స్పష్టం చేయాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్ చేశారు. జగిత్యాలలోని కమల నిలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.అధికారిక కార్యక్రమాల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు కనీస మర్యాదలు కూడా పాటించడం లేదని ఆమె విమర్శించారు. సభా మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు ఉందా అని ప్రశ్నించారు. కార్యక్రమాల్లో […]
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి భూమి రిజిస్ట్రేషన్

మెట్పల్లి/ధనాధన్ న్యూస్,జూన్ 14: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మెట్పల్లి పోలీసులు ఆదివారం వివరాలు వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, మెట్పల్లి పట్టణంలోని ఆరపేట వార్డు శివారులో ఉన్న సర్వే నంబర్ 191 భూమికి సంబంధించి నిందితులు నకిలీ ఆబాది సర్టిఫికేట్ రూపొందించారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ ముద్రలను ఉపయోగించి తప్పుడు […]
డా.బి.ఆర్.అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రతి పౌరుడు తెలుసుకోవాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 14:జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మెట్రో ఉదయం జిల్లా స్టాఫ్ రిపోర్టర్, సీఎంపీ న్యూస్ ఛానల్ అధినేత మల్యాల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. […]
జగిత్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఐఎంఏ ముందడుగు

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 13: మాదకద్రవ్యాల వ్యసన నిర్మూలనకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించనున్న “యాంటీ డ్రగ్ 3కే రన్” కార్యక్రమ కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న మాదకద్రవ్యాల వ్యసనం దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా […]
అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జీవన్ రెడ్డి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 13: జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయిన రాచర్ల గంగాధర్ నివాసాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి శనివారం సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం అందజేశారు.అగ్నిప్రమాదం నేపథ్యంలో సంబంధిత అధికారులతో జీవన్ రెడ్డి ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. గంగాధర్ స్వయం ఉపాధితో జీవనం సాగించే నిరుపేద కుటుంబానికి […]
మోచి బజార్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 12:జగిత్యాల పట్టణంలోని మోచి బజార్ ప్రాంతంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో ఘటన స్థలానికి చేరుకుని సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని కొంత సామగ్రి దగ్ధమైనట్లు తెలిసింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న జగిత్యాల […]
గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 10:జగిత్యాల పట్టణంలోని వాణీనగర్లో నిర్వహించిన శ్రీ గంగమ్మ జాతర ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గంగమ్మ తల్లికి బోనాలు ఎత్తుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మ తల్లి కటాక్షంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, […]
