- భారీ మెజారిటీతో గెలిపించిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు
- మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని చేస్తా-టిపిటిఎల్ఏ ప్రెసిడెంట్ రహమాన్
జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్- టిపిటిఎల్ఏ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఆదివారం జమ్మికుంట పట్టణంలో లోటస్ పాండ్ స్కూల్ ఎన్నికలు నిర్వహించారు.. నిర్వహించిన ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడగా మొత్తం ఓట్లు 479కి కాను 423 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో రహమాన్ కి 233 ఓట్లు, స్వర్ణలతకి 102 ఓట్లు, జగన్ కి 85 ఓట్లు వచ్చాయి.. మహమ్మద్ రహమాన్ తమ సమీప అభ్యర్థి పైన 131 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.. ఈ ఎలక్షన్ కి ఎన్నికల అధికారి గా లోటస్ పాండ్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు ఎన్నికల కమిటీ సభ్యులు కొండ విజయ్,చుక్క భాస్కర్, నల్ల శ్రీనివాస్ రెడ్డి, చింతం రాజేందర్, మేకల శ్రీనివాస్ యాదవ్ లు వ్యవహారించారు. ఎన్నికల్లో జమ్మికుంట పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు లెక్చరర్ అందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గెలుపొందిన రహమాన్ కి ఎన్నికల అధికారి కరస్పాండెంట్ డాక్టర్ పుల్లూరి సంపత్ రావు అధ్యక్షత ధ్రువీకరణ పత్రం అందించి అభినందించారు.. కార్మిక సంఘ నాయకుడు సామ్రాజ్యం లు అభినందించారు.ఈ సందర్భంగా అధ్యక్షునిగా గెలుపొందిన రహమాన్ మాట్లాడుతూ నన్ను నమ్మి భారీ మెజారిటీతో గెలిపించిన నా టిపిటిఎల్ఎ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న అని, ఎన్నికలలో నేను మీకు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చి సంఘ అభివృద్ధి కోసం సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తానని, నన్ను గెలిపించిన మిత్రులు శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నని అన్నారు…ఈ ఎన్నికలలో జమ్మికుంట పట్టణంలోని పాఠశాలల, కళాశాలలో ఉన్న టీచర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు..
