రెండవ విడత దళిత బంద్ వెంటనే విడుదల చేయాలి.

దళితబందు రెండవ విడత మంజూరు చేయాలనీ ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు దళితబంద్ లబ్ధిదారులు వినతిపత్రం అందించడం జరిగింది. 2021 సంవత్సరంలో బీ అర్ ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు గా ప్రవేశపెట్టిన దళితబందు హుజురాబాద్ నియోజకవర్గం లోని ప్రతి కుంటుంబానికి 10లక్షల చొప్పున వారి వారి ఖాతాలలో జమచేయడం జరిగింది.మొదటి విడతగా 5లక్షలు రెండవ విడిడతగా 5లక్షలు ఇస్తామని కలెక్టర్ చెప్పడం జరిగింది.కానీ అనుకోకుండా ఎన్నికల నియామావలి రావడంతో దళితబందు ని … Read more

పెరకపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన సర్పంచ్ బత్తుల కొమరయ్య.

సైదాపూర్ మండల కేంద్రంలోని పెర్కపల్లె గ్రామంలో పదవి విరమణ సమావేశాన్ని నిర్వహించారు సర్పంచ్ బత్తుల కొమరయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచిగా గెలిపించిన ప్రజలకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానని జంట గ్రామాలు అయిన గొల్లగూడెం పెర్కపల్లి గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించడం కోటి రూపాయలతో వాడ వాడకు సిసి రోడ్డు నిర్మాణం చేయడం డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని ఐదు సంవత్సరాల రాజకీయ పరిపాలనలో … Read more

బిజిగిరి దర్గాలో ప్రత్యేక పూజలు.

జమ్మికుంట,ధనా ధన్ న్యూస్. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు,పేద ప్రజలకు అన్నదానం,కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలోని దర్గాలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ మైనార్టీ ఇన్చార్జ్ ఎండి సలీం పాషా,మాజీ జెడ్పీటిసీ అరుకాల వీరేశలింగం,జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు … Read more

కేసీఆర్ కుట్రలను సాగనివ్వం

తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి ఎన్నికను అడ్డుకుంటున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెబుతారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అన్నారు. కోదండరాంపై కేసీఆర్ కుట్రలు కొత్తేమి కాదని గత తొమ్మిది సంవత్సరాలుగా అనేక రకాల దాడులకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో కోదండరాం పోటీ చేస్తే వందలాది కోట్లు ఖర్చుపెట్టి ఆరోజు ఓడించారని పేర్కొన్నారు.కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టడమే … Read more

బీఆర్ఎస్ పార్టీకి జమ్మికుంట కౌన్సిలర్ల రాజీనామా.

జమ్మికుంట మున్సిపాలిటీ కి చెందిన 13 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన వారిలో బొంగోని వీరన్న,మారపెల్లి బిక్షపతి, మేడిపల్లి రవీందర్,ఎలాగందుల స్వరూప,పిట్టల శ్వేత, పొనగంటి రాము,పొనగంటి సారంగం,బిట్ల కళావతి,కుతాడి రాజయ్య,దేశిని రాధ,గుళ్లి పూలమ్మ,దిడ్డి రాము,రావికంటి రాజ్ కుమార్ ఉన్నారు.మున్సిపాలిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే ల వైఖరిలు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నామని లేఖలో తెలిపారు.

కాంగ్రెస్ లోకి జమ్మికుంట బీఆర్ఎస్ కౌన్సిలర్లు.

జమ్మికుంట మున్సిపాలిటీ లో మళ్ళీ కలవరం మొదలైంది.మొన్నటి వరకు చైర్మన్ పై అవిశ్వాసం తో పరిపాలన అస్తవ్యస్తంగా జరిగింది. మొన్నటి వరకు ఒక వర్గం లో ఉన్న 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు నేడు కాంగ్రెస్ లో చేరడానికి హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున బీ ఫామ్ హామీతో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నట్లు సమాచారం.మొన్నటి వరకు పెట్టిన అవిశ్వాసం లో కీలక పాత్ర వహించిన కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో … Read more

సర్పంచి కూతురు చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం.

సైదాపూర్, ధనా ధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రి ఉన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రారంభోత్సవాలు మేమే చేసుకుంటామంటే నడవదు.హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోటే ముందుకు వెళుతున్న గెలిచిన వెంటనే హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఫోన్ చేశానని అన్నారు.పొన్నం ప్రభాకర్ కు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన చరిత్ర ఉంది … Read more

ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని లాంచ్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం.

-ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ మీడియా పాత్ర కీలకం. -వార్తకోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. -ఎప్పటి వార్తలు అప్పుడే చూసుకోవచ్చు. -ప్రజా సమస్యలపై ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు వారధి ఉండాలే. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ లో జరిగిన పీవి హుజురాబాద్ జిల్లా సాధన సదస్సు కార్యక్రమానికి తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ధనా ధన్ న్యూస్ పోర్టల్ ని ఆయన లాంచ్ చేశారు.ఈ సందర్బంగా … Read more

ప్రొఫెసర్ కోదండరాం ని సన్మానించిన విద్యార్థి నాయకులు..

-ఉద్యమకారులను గౌరవించిన తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ ఉద్యమకారుల ప్రతినిధి ప్రొఫెసర్ కోదండరాం. హుజురాబాద్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమ రథసారధి ప్రొఫెసర్ కోదండరాం నూతనంగా ఎమ్మెల్సీ గా నియామకం అయిన సంధర్భంగా తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ బృందం అధ్వర్యంలో ఆత్మీయ సన్మానంతో సత్కరించడం జరిగింది.తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది ఉద్యమకారులేనని, వారి పాత్ర మరువలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమ ఘట్టంలో అన్నీ పార్టీలను … Read more

మేడారం మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహా జాతర పోస్టర్‌ను శనివారం సాయంత్రం ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు ఉన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. సమ్మక్క – సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. భక్తులకు ఇబ్బంది … Read more