ఆ గ్రామంలో మద్యం అమ్మేవారి చెప్తే 10 వేల నజరానా

కామారెడ్డి/ధనాధన్ న్యూస్: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోతాయిపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో మద్యనిషేధం విధిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో బెల్టుషాపులు ఎక్కువవటం వల్ల యువకులు, రైతుకూలీలు మద్యానికి బానిసలై ఆర్థికంగా నష్టపోతున్నారని.. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్న విషయాలను పరిగణలోకి తీసుకుని.. మద్యనిషేధం విదిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ మద్యనిషేధ తీర్మానం.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.అయితే.. ఫిబ్రవరి ఒకటో తారీఖు … Read more

ఆల్ఫోర్స్ లో ఘనంగా మెహందీ వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మెహేంది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు వివిధ డిజైన్లలో మెహందీ పెట్టుకొని పెట్టుకొని ప్రదర్శించారు. మెహందీ పెట్టుకున్న విద్యార్థుల పిల్లల చేతులు ఎర్రబడి చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయం పండుగలో మెహందీ పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు.మెహందీ లేకుండా మన భారత దేశంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించుకోరని  గుర్తు చేశారు.మన … Read more

పెండింగ్ ఫీజ్ బకాయిలను వెంటనే చెల్లించాలి

కామారెడ్డి,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల కు సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ బి.ఎడ్ ప్రొఫెషనల్ కళాశాలకు సంబంధించిన 5500 కోట్ల పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ,నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం … Read more