‘చాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 27: జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి బోగోజి ముఖేష్ కన్నా ఆధ్వర్యంలో నిర్వహించిన “చాత్రోన్ కీ గూంజ్” కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలోని విద్యార్థులు, యువత, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ […]
ప్రజల పక్షాన పోరాడే సీపీఐని బలోపేతం చేద్దాం

కరీంనగర్/ధనాధన్ న్యూస్, జూన్ 27: ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ని బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై సంఘటితంగా ఉద్యమాలు నిర్వహించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.శనివారం గుంటూరుపల్లి గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ […]
పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, వారికి రావాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులో విఫలమైందని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి విమర్శించారు.బుధవారం జమ్మికుంటలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు డీఏలను విడుదల చేస్తామని, పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ హామీలను అమలు చేయలేదని […]
“తవ్వారు..వదిలేశారు..! స్కూల్ పక్కనే ప్రమాదాలకు ఆహ్వానం”

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: కరీంనగర్ నగరంలోని 40వ డివిజన్ హనుమాన్నగర్లో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం రహదారి పక్కన గుంతలు తవ్వి, ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేయడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు విమర్శించారు. బ్లూబెల్స్ పాఠశాల సమీపంలోని సందు రహదారి వెంట డ్రైనేజీ పనులు చేపట్టి, ప్రజలకు హెచ్చరికలు లేకుండా వదిలేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, స్థానిక ప్రజలు […]
హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: రాష్ట్రంలోని అన్ని రంగాల హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం బొమ్మకల్ సిమెంట్ గోదాముల హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సిమెంట్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు పని భద్రత […]
జిల్లా కలెక్టరేట్కు ఆర్టీఐ నోటీసులు

బుగ్గారం,జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 24:జగిత్యాల జిల్లా కలెక్టరేట్కు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నుంచి నాలుగు ఆర్టీఐ కేసులకు సంబంధించి నోటీసులు జారీ అయినట్లు సీనియర్ ఆర్టీఐ కార్యకర్త, సామాజికవేత్త చుక్క గంగారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని జిల్లా కలెక్టరేట్ అధికారులను నోటీసుల్లో ఆదేశించినట్లు చెప్పారు. అయితే, ఈ నోటీసులను జిల్లా […]
వర్షాలు కురవాలంటూ గ్రామదేవతలకు జలాభిషేకాలు

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ, వర్షాలు కురవాల్సిన సమయంలోనూ వర్షాల జాడ కనిపించకపోవడంతో హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.గ్రామంలో ఉన్న గ్రామదేవతలు, వనదేవతలు, హనుమంతుడు, భైరవాది గుట్టలోని కాలభైరవ స్వామికి జలాభిషేకాలు చేసి వర్షాలు కురవాలని వేడుకున్నారు. సంప్రదాయ ఆచారాల ప్రకారం బండపై వరద పాశం పోసి నాలుకతో అద్దడం, బతకమ్మ ఆటలు ఆడడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుపక్షాదులు, ప్రజలు చల్లగా […]
మానవత్వం చాటుకున్న రాయికల్ 2004-05 ఎస్ఎస్సీ బ్యాచ్ మిత్రులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 21: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన 2004-05 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులు తమ సహాధ్యాయి మాచర్ల నాగరాజుకు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.రాయికల్ గ్రామానికి చెందిన మాచర్ల నాగరాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో ఆయన తండ్రి మాచర్ల కొమురయ్య గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న 2004-05 ఎస్ఎస్సీ బ్యాచ్ మిత్రులు […]
పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 20: సారంగాపూర్ మండలం పోతారం గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్క దాడిలో గాయపడిన బాధితులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. పిచ్చికుక్క దాడిలో మహిళలు సహా 11 మందికి పైగా గాయపడగా, వారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యే బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడిన […]
అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:అటవీశాఖ అధికారులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 18 (ప్రతినిధి):వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలోని అటవీ భూమిలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఉన్నతాధికారులు అడవుల ఆవశ్యకత, మొక్కల పెంపకం ప్రాధాన్యత, వాటి సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు, సలహాలు అందించారు. అలాగే రాయికల్ అటవీ ప్రాంతంలో ఉన్న రాయికల్ జలపాతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయికల్ […]
